Skip to main content

Posts

మెగా హీరో జోడీగా కైరా అద్వాని

బాలీవుడ్ అందాల తారగా ప్రస్తుతం కైరా అద్వాని ఒక వెలుగు వెలుగుతోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే,  'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అలాంటి కైరా అద్వాని తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ ఒక సినిమాను నిర్మించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కైరాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.  

సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు: మోదీ

  భవిష్యత్ అంతా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సాయం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. ప్రపంచానికి భారత్ ఎందరో గొప్ప సైంటిస్టులను అందించిందని తెలిపారు. కోల్ కతాలో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు తమ ప్రభుత్వం సంస్థాగత సాయం అందిస్తుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడూ ఓటమి ఉండదని, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని, కానీ వారు అనుకున్నది సాధ్యపడలేదని తెలిపారు. కోరుకున్న ఫలితాలు రాకపోయినా మిషన్ మాత్రం విజయవంతమైందని పేర్కొన్నారు.

ప్రతిభా పురస్కారాల పేరు మార్చుతూ ఇచ్చిన జీవో రద్దు

  అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. 'అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది' అని అన్నారు. 'ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు.  

ఆజాద్ ముందే వీహెచ్, షబ్బీర్ అలీ మాటలయుద్ధం

    కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇవాళ హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ నేతలతో భేటీ అయ్యారు. అయితే, ఆజాద్ సమక్షంలో సీనియర్ నేతలు వీహెచ్, షబ్బీర్ అలీ వాగ్యుద్ధానికి దిగారు. తాను రిటైర్మెంట్ దశకు వచ్చానని షబ్బీర్ అలీ పదేపదే అంటున్నారని వీహెచ్ ఆరోపించగా, వీహెచ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అలీ బదులిచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలైన తమను శవాలంటున్నారని, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో షబ్బీర్ అలీ కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆజాద్ చూస్తుండగానే ఇద్దరు నేతలు పరస్పరం దూషించుకున్నారు. ఆజాద్ సర్దిచెప్పడంతో ఇరువురు శాంతించినా, కాసేపటికి వీహెచ్ అక్కడ్నించి వెళ్లిపోయారు.  

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారు: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

  స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువంతపురం సమావేశంలో చర్చించడం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని, కేరళలో ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు.  కేరళలో నవంబరు 17 నుంచి మండల, మకరవిలక్కు ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఈ రోజు తిరువనంతపురంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల సీఎంలు, దేవాదాయశాఖల మంత్రుల సమావేశం జరిగిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా తాను పాల్గొన్నానన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాముల కోసం శబరిమలైలో కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి  స్థలం కేటాయించమని కేరళ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.  సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలపై కేరళ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ప్రతి రాష్ట్రంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ లను అనుసంధానిస్తూ  కేరళ లో జాయింట్ గా ఐదు ...

మీరు త్వరగా కోలుకోవాలి... నటుడు గొల్లపూడికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పరామర్శ

   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గొల్లపూడి చికిత్స పొందుతున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గొల్లపూడి మారుతిరావు వృద్ధాప్య కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.  

ఒక్కసీటొస్తేనే మిడిసిపడుతున్నారు:కన్నబాబు

   ఇసుక కొరతను ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని మంత్రి కన్నబాబు విమర్శించారు. వరదల కారణంగా కొంతమేర ఇసుక కొరత ఉండటం వాస్తమేనని.. 10, 15 రోజుల్లో ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిన తెదేపా నేతలతో కలిసి లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన పవన్‌కు ఇసుక కొరతపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఒక్క సీటు వస్తేనే ఆయన మిడిసిపడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ సినిమాలు వదిలేసినా.. యాక్టింగ్‌ వదలడం లేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా జగన్‌నే విమర్శించడమేంటని ఆయన ప్రశ్నించారు. ‘‘నన్ను తిట్టడం పవన్‌కు ఫ్యాషన్ అయిపోయింది.  నా బతుకులో దాపరికం లేదు.  మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు జనం బతుకులు చూసుకోవాలి. చిరంజీవి గారి వలనే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటుంటా.  రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఏనాడైనా చిరంజీవి పేరు చెప్పారా?  గాజువాకలో పవన్ పోటీ చేస్తే...

మోదీకి లేఖ రాసిన జగన్

  ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఏపీ జెన్ కో థర్మల్ ప్లాంట్ కు ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సింగరేణి కాలరీస్ ను తెలంగాణకు కేటాయించారని... బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రతి ఏటా 7.5 ఎంఎంటీఏలు అవసరమని తెలిపారు. జగన్ లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.  

ఉద్యోగాలు కాపాడుకోవడమా, కోల్పోవడమా కార్మికులే తేల్చుకోవాలి: సీఎం కేసీఆర్

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నవంబరు 5 అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరాలని గడువు విధించామని, గడువు లోపు విధుల్లో చేరని ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ తీసుకోబోమని స్పష్టం చేశారు. ఉద్యోగాలు కాపాడుకుంటారో, కోల్పోతారో కార్మికులే తేల్చుకోవాలని అన్నారు. నవంబరు 5 అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరకుంటే ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ఆర్టీసీ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు.   

సీఎస్ బదిలీపై ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా బదిలీ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సీఎస్ ను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా గానీ, ఇలా జరిగివుండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తులను ఉద్యోగాల నుంచి తప్పించినందుకు ప్రతిఫలంగానే సీఎస్ ను బదిలీ చేసినట్టయితే మరీ దారుణం అని భావించాల్సి ఉంటుందని తెలిపారు. బాధ్యత లేకుండా అధికారం చెలాయించే సీఎం కార్యాలయం ముఖ్యమంత్రుల మెడకు ఉచ్చులా మారుతోందని వ్యాఖ్యానించారు.  

పప్పువర్మ' చిత్రాన్ని ఆమెకు అంకితం ఇస్తా: జొన్నవిత్తుల వెల్లడి

  తనను జొన్నవిత్తుల చౌదరి అన్నాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గీత రచయిత జొన్నవిత్తుల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వర్మపై బయోపిక్ తీస్తానని, దానికి పప్పువర్మ అనే పేరు పెడతానని ఇప్పటికే జొన్నవిత్తుల ప్రకటించారు. తాజాగా ఓ మీడియా చానల్ చర్చా కార్యక్రమం నుంచి మాట్లాడుతూ, పప్పువర్మ అనే చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని, ఆ సినిమాను మియా మాల్కోవా అనే నటీమణికి అంకితం ఇస్తామని వెల్లడించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీసి బాలకృష్ణకు అంకింతం ఇచ్చినప్పుడు, తాను పప్పువర్మ చిత్రాన్ని మియా మాల్కోవాకు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు. ఈ ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా ఫస్ట్ సాంగ్ ఇనాగరేషన్ ఉంటుందని జొన్నవిత్తుల చానల్ సాక్షిగా ప్రకటించారు. తనలో ఈ ఆలోచన రావడానికి పప్పువర్మే కారణమని వివరించారు. వర్మ వ్యక్తిగత జీవితంలో ఎన్ని తమాషాలు ఉన్నాయో అన్నీ చూపిస్తామని, అతడి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని జొన్నవిత్తుల వెల్లడించారు.  వర్మ అభిమానులు ఎంతో అమాయకులు అని, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అ...

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత

 ముఖ్యమంత్రి పీఠంపై శివసేన పట్టువీడకపోవడంతో భారతీయ జనతా పార్టీ కూడా స్వరం పెంచింది. తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ శివసేన బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో కమళదళం ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ధూలే జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా ఈ డిమాండ్‌ వ్యక్తమైనట్లు సీఎం ఫడణవీస్‌కు సన్నిహితుడైన మంత్రి జయకుమార్‌ రావల్‌ ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోకూడదని, తమకు ఓ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేసి గెలిచి చూపిస్తామని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వెలిబుచ్చినట్లు రావల్‌ తెలిపారు. శివసేన కారణంగా కొన్ని చోట్ల పార్టీకి దూరమవ్వాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు ...

ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీపై కేశినేని నాని వ్యంగ్యాస్త్రం!

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే బదిలీ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. అందరినీ విస్మయానికి గురిచేస్తూ ఏపీ సర్కారు ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేసింది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. "ఏపీ సీఎస్ ఓ అంశంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకంగా సీఎస్ నే బదిలీ చేశారు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్పిడి అంశంలో చోటుచేసుకున్న వివాదమే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కారణమని తెలుస్తోంది. సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత వారం ఓ వివాదాస్పద జీవో రిలీజ్ చేశారు. దానిపై వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులు పంపారు. షోకాజ్ నోటీసులకు జవాబు చెప్పాల్సిన సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఏకంగా సీఎస్ నే బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి సంచలనం సృష్టించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మరో ఐదు నెలలు సర్వీసు ఉంది. ఈ లోపే ...

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు

    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసింది. ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించింది. మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేశారు. తక్షణమే విధుల నుంచి తప్పుకుని, నీరబ్ కుమార్ కు బాధ్యతలను అప్పగించాలని సుబ్రహ్మణ్యంకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఆయనను బదిలీ చేయడం గమనార్హం.  

తహసీల్దార్‌ సజీవ దహనం

   హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఓ దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్‌ డ్రైవర్‌తో పాటు అటెండర్‌ను హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.  అబ్దుల్లాపూర్‌మ...

త్వరలో అయోధ్య వివాదంపై తీర్పు... నెటిజన్లకు పోలీసుల హెచ్చరికలు

ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదంపై మరి కొన్నిరోజుల్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అయోధ్య అంశంపై ఇతరుల మనోభావాలు గాయపడేలా అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని శాంతిభద్రతలను దెబ్బతీస్తే అలాంటివారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని యూపీ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా సైట్లపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.  

అమరావతిలో పవన్ కల్యాణ్ ఆమరణ నిరహార దీక్ష"... అసలు విషయం చెప్పిన 'శతఘ్ని'!

  ఏపీలో ఇసుక కొరత అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో ఆయన ఆదివారం భారీస్థాయిలో లాంగ్ మార్చ్ నిర్వహించి ఇతర రాజకీయ పక్షాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే, మరో రెండు వారాల్లో అమరావతిలో పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతోంది. దీనిపై జనసేన మీడియా విభాగం శతఘ్ని వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ ప్రెస్ నోట్ అని, జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వచ్చిన సమాచారమే అధికారికం అవుతుందని శతఘ్ని వెల్లడించింది. జనసేన ఫేక్ అని చెబుతున్న ప్రెస్ నోట్ ఇదే...

పవన్ కు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలి: మంత్రి అవంతి

విశాఖలో పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఆదివారం జరిగిన సభలో పవన్ అనుభవలేమి, అజ్ఞానం బయటపడ్డాయని, పవన్ ఓ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరూ రాజకీయనాయకులు కాలేరు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్ కల్యాణ్ ఓ సినిమా ఉచితంగా చేశాననుకుని ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వవచ్చు కదా అని హితవు పలికారు. పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటికే పరువు కోల్పోయిన పవన్, ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం ద్వారా మరింత దిగజారిపోతున్నాడని విమర్శించారు. పవన్ ఇంకా సినిమా మాయలోనే ఉన్నాడని, వైసీపీ నేతలకు ఇసుక రవాణాతో సంబంధం ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. లాంగ్ మార్చ్ అని చెప్పి కేవలం 2 కిలోమీటర్లు కూడా నడవలేకపోయారని, కానీ సీఎం జగన్ 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని తెలిపారు.  

ఇసుక కొరతపై జగన్ స్పందన

ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తోందని, అన్ని నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 265 రీచ్ లలో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. ఇసుక కోసం లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిచిందని... ఇసుక ఉచితం అని చెప్పి మాఫియాను నడిపించారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇసుక సమస్య తాత్కాలికమేనని అన్నారు. ప్రజలకు మేలు చేసేలా మర్గదర్శకాలను రూపొందించామని చెప్పారు.

అల వైకుంఠపురములో' నుంచి టబు ఫస్టులుక్

  తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా 'టబు' ఒక వెలుగు వెలిగింది. నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లోనూ తన సత్తాను చాటి చెప్పింది. కొంత కాలంగా ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ రోజున ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'అల వైకుంఠపురములో' టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను వదిలారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో .. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీమంతురాలైన 'అలకనందాదేవి' పాత్రలో టబు కనిపించనుంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా వుండనున్నట్టు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.