Skip to main content

సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు: మోదీ

 
భవిష్యత్ అంతా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సాయం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. ప్రపంచానికి భారత్ ఎందరో గొప్ప సైంటిస్టులను అందించిందని తెలిపారు. కోల్ కతాలో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు తమ ప్రభుత్వం సంస్థాగత సాయం అందిస్తుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడూ ఓటమి ఉండదని, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని, కానీ వారు అనుకున్నది సాధ్యపడలేదని తెలిపారు. కోరుకున్న ఫలితాలు రాకపోయినా మిషన్ మాత్రం విజయవంతమైందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...