Skip to main content

సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు: మోదీ

 
భవిష్యత్ అంతా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సాయం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. ప్రపంచానికి భారత్ ఎందరో గొప్ప సైంటిస్టులను అందించిందని తెలిపారు. కోల్ కతాలో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు తమ ప్రభుత్వం సంస్థాగత సాయం అందిస్తుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడూ ఓటమి ఉండదని, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని, కానీ వారు అనుకున్నది సాధ్యపడలేదని తెలిపారు. కోరుకున్న ఫలితాలు రాకపోయినా మిషన్ మాత్రం విజయవంతమైందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.