Skip to main content

ఒక్కసీటొస్తేనే మిడిసిపడుతున్నారు:కన్నబాబు

 
ఒక్కసీటొస్తేనే మిడిసిపడుతున్నారు:కన్నబాబు
 ఇసుక కొరతను ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని మంత్రి కన్నబాబు విమర్శించారు. వరదల కారణంగా కొంతమేర ఇసుక కొరత ఉండటం వాస్తమేనని.. 10, 15 రోజుల్లో ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిన తెదేపా నేతలతో కలిసి లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన పవన్‌కు ఇసుక కొరతపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఒక్క సీటు వస్తేనే ఆయన మిడిసిపడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ సినిమాలు వదిలేసినా.. యాక్టింగ్‌ వదలడం లేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా జగన్‌నే విమర్శించడమేంటని ఆయన ప్రశ్నించారు.
‘‘నన్ను తిట్టడం పవన్‌కు ఫ్యాషన్ అయిపోయింది. నా బతుకులో దాపరికం లేదు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు జనం బతుకులు చూసుకోవాలి. చిరంజీవి గారి వలనే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటుంటా. రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఏనాడైనా చిరంజీవి పేరు చెప్పారా?  గాజువాకలో పవన్ పోటీ చేస్తే చంద్రబాబు ప్రచారం చేయలేదు. మంగళగిరిలో లోకేశ్‌ పోటీ చేస్తే జనసేన పార్టీ తరుఫున అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? 15 రోజుల్లో ఇసుక సమస్య తీర్చకపోతే అమరావతి వీధుల్లో నడుస్తానంటూ పవన్ సవాల్  చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు తప్ప మరో నాయకుడు ఆయనకు కనబడటం లేదు. అమరావతిలో అసలు వీధులే లేవు. చంద్రబాబు చూపింది గ్రాఫిక్స్ మాత్రమే. పవన్‌ కృత్రిమ రాజకీయ పోరాటాలు మానుకోవాలి. ఇసుక కొరత సమస్యను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది’’ అని కన్నబాబు చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...