Skip to main content

ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీపై కేశినేని నాని వ్యంగ్యాస్త్రం!


ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే బదిలీ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. అందరినీ విస్మయానికి గురిచేస్తూ ఏపీ సర్కారు ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేసింది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. "ఏపీ సీఎస్ ఓ అంశంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకంగా సీఎస్ నే బదిలీ చేశారు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ ట్వీట్ చేశారు.

ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్పిడి అంశంలో చోటుచేసుకున్న వివాదమే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కారణమని తెలుస్తోంది. సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత వారం ఓ వివాదాస్పద జీవో రిలీజ్ చేశారు. దానిపై వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులు పంపారు. షోకాజ్ నోటీసులకు జవాబు చెప్పాల్సిన సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఏకంగా సీఎస్ నే బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి సంచలనం సృష్టించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మరో ఐదు నెలలు సర్వీసు ఉంది. ఈ లోపే ఆయన సీఎస్ పోస్టు నుంచి బదిలీ కావడం అటు రాజకీయ వర్గాలను, ఇటు అధికార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...