Skip to main content

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత
 ముఖ్యమంత్రి పీఠంపై శివసేన పట్టువీడకపోవడంతో భారతీయ జనతా పార్టీ కూడా స్వరం పెంచింది. తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ శివసేన బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో కమళదళం ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ధూలే జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా ఈ డిమాండ్‌ వ్యక్తమైనట్లు సీఎం ఫడణవీస్‌కు సన్నిహితుడైన మంత్రి జయకుమార్‌ రావల్‌ ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు.

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోకూడదని, తమకు ఓ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేసి గెలిచి చూపిస్తామని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వెలిబుచ్చినట్లు రావల్‌ తెలిపారు. శివసేన కారణంగా కొన్ని చోట్ల పార్టీకి దూరమవ్వాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...