Skip to main content

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత
 ముఖ్యమంత్రి పీఠంపై శివసేన పట్టువీడకపోవడంతో భారతీయ జనతా పార్టీ కూడా స్వరం పెంచింది. తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ శివసేన బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో కమళదళం ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ధూలే జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా ఈ డిమాండ్‌ వ్యక్తమైనట్లు సీఎం ఫడణవీస్‌కు సన్నిహితుడైన మంత్రి జయకుమార్‌ రావల్‌ ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు.

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోకూడదని, తమకు ఓ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేసి గెలిచి చూపిస్తామని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వెలిబుచ్చినట్లు రావల్‌ తెలిపారు. శివసేన కారణంగా కొన్ని చోట్ల పార్టీకి దూరమవ్వాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...