Skip to main content

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత
 ముఖ్యమంత్రి పీఠంపై శివసేన పట్టువీడకపోవడంతో భారతీయ జనతా పార్టీ కూడా స్వరం పెంచింది. తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ శివసేన బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో కమళదళం ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ధూలే జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా ఈ డిమాండ్‌ వ్యక్తమైనట్లు సీఎం ఫడణవీస్‌కు సన్నిహితుడైన మంత్రి జయకుమార్‌ రావల్‌ ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు.

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోకూడదని, తమకు ఓ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేసి గెలిచి చూపిస్తామని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వెలిబుచ్చినట్లు రావల్‌ తెలిపారు. శివసేన కారణంగా కొన్ని చోట్ల పార్టీకి దూరమవ్వాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...