Skip to main content

పప్పువర్మ' చిత్రాన్ని ఆమెకు అంకితం ఇస్తా: జొన్నవిత్తుల వెల్లడి

 


తనను జొన్నవిత్తుల చౌదరి అన్నాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గీత రచయిత జొన్నవిత్తుల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వర్మపై బయోపిక్ తీస్తానని, దానికి పప్పువర్మ అనే పేరు పెడతానని ఇప్పటికే జొన్నవిత్తుల ప్రకటించారు. తాజాగా ఓ మీడియా చానల్ చర్చా కార్యక్రమం నుంచి మాట్లాడుతూ, పప్పువర్మ అనే చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని, ఆ సినిమాను మియా మాల్కోవా అనే నటీమణికి అంకితం ఇస్తామని వెల్లడించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీసి బాలకృష్ణకు అంకింతం ఇచ్చినప్పుడు, తాను పప్పువర్మ చిత్రాన్ని మియా మాల్కోవాకు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు.

ఈ ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా ఫస్ట్ సాంగ్ ఇనాగరేషన్ ఉంటుందని జొన్నవిత్తుల చానల్ సాక్షిగా ప్రకటించారు. తనలో ఈ ఆలోచన రావడానికి పప్పువర్మే కారణమని వివరించారు. వర్మ వ్యక్తిగత జీవితంలో ఎన్ని తమాషాలు ఉన్నాయో అన్నీ చూపిస్తామని, అతడి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని జొన్నవిత్తుల వెల్లడించారు. 
వర్మ అభిమానులు ఎంతో అమాయకులు అని, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, వర్మ దేశభక్తి వద్దన్నాడని వాళ్లు మానుకోరు కదా, వర్మ తల్లి, భార్య ఎందుకు అన్నాడని వాళ్లు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండరు కదా అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేసినందుకు వర్మపై కోపం లేదని, తాను వర్మను బాగు చేయాలని భావిస్తున్నానని తెలిపారు.

"తాను చనిపోతే ఇంట్లో అందరూ ఆనందిస్తారని వర్మే అన్నాడు. కానీ అతను చనిపోయే లోపు అతడ్ని బాగు చేసి, అతడి తల్లికి ఓ మంచివాడ్ని అందించాలన్నది నా అభిమతం. అతడి విమర్శల్లోంచి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాను" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...