Skip to main content

పప్పువర్మ' చిత్రాన్ని ఆమెకు అంకితం ఇస్తా: జొన్నవిత్తుల వెల్లడి

 


తనను జొన్నవిత్తుల చౌదరి అన్నాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గీత రచయిత జొన్నవిత్తుల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వర్మపై బయోపిక్ తీస్తానని, దానికి పప్పువర్మ అనే పేరు పెడతానని ఇప్పటికే జొన్నవిత్తుల ప్రకటించారు. తాజాగా ఓ మీడియా చానల్ చర్చా కార్యక్రమం నుంచి మాట్లాడుతూ, పప్పువర్మ అనే చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని, ఆ సినిమాను మియా మాల్కోవా అనే నటీమణికి అంకితం ఇస్తామని వెల్లడించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీసి బాలకృష్ణకు అంకింతం ఇచ్చినప్పుడు, తాను పప్పువర్మ చిత్రాన్ని మియా మాల్కోవాకు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు.

ఈ ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా ఫస్ట్ సాంగ్ ఇనాగరేషన్ ఉంటుందని జొన్నవిత్తుల చానల్ సాక్షిగా ప్రకటించారు. తనలో ఈ ఆలోచన రావడానికి పప్పువర్మే కారణమని వివరించారు. వర్మ వ్యక్తిగత జీవితంలో ఎన్ని తమాషాలు ఉన్నాయో అన్నీ చూపిస్తామని, అతడి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని జొన్నవిత్తుల వెల్లడించారు. 
వర్మ అభిమానులు ఎంతో అమాయకులు అని, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, వర్మ దేశభక్తి వద్దన్నాడని వాళ్లు మానుకోరు కదా, వర్మ తల్లి, భార్య ఎందుకు అన్నాడని వాళ్లు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండరు కదా అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేసినందుకు వర్మపై కోపం లేదని, తాను వర్మను బాగు చేయాలని భావిస్తున్నానని తెలిపారు.

"తాను చనిపోతే ఇంట్లో అందరూ ఆనందిస్తారని వర్మే అన్నాడు. కానీ అతను చనిపోయే లోపు అతడ్ని బాగు చేసి, అతడి తల్లికి ఓ మంచివాడ్ని అందించాలన్నది నా అభిమతం. అతడి విమర్శల్లోంచి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాను" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.  

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...