Skip to main content

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారు: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

 

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువంతపురం సమావేశంలో చర్చించడం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని, కేరళలో ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు. 

కేరళలో నవంబరు 17 నుంచి మండల, మకరవిలక్కు ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఈ రోజు తిరువనంతపురంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల సీఎంలు, దేవాదాయశాఖల మంత్రుల సమావేశం జరిగిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా తాను పాల్గొన్నానన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాముల కోసం శబరిమలైలో కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి  స్థలం కేటాయించమని కేరళ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.

 సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలపై కేరళ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ప్రతి రాష్ట్రంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ లను అనుసంధానిస్తూ  కేరళ లో జాయింట్ గా ఐదు రాష్ట్రాలతో కలిపి సెంట్రల్ హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తామని విజయన్ హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశం అనంతరం అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా, వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు, కేరళ సీఎం విజయన్ కు కనకదుర్గ అమ్మవారి ప్రసాదం అందజేసి వారిని సన్మానించినట్లు మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.