Skip to main content

Posts

సీక్రెట్‌ రివీల్‌: తన వయసెంతో చెప్పిన హాట్‌ యాంకర్ అనసూయ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న హాట్ బ్యూటీ అనసూయ. జబర్థస్త్ షోతో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉంది. అయితే గ్లామర్ ఫీల్డ్‌ ఉన్న బ్యూటీ తన వయసు గురించి కామెంట్ చేసేందుకు పెద్దగా ఇష్టపడరు, కానీ ఇటీవల ఓ షోలో పాల్గొన్న అనసూయ తన వయసెంతో బయటపెట్టింది. న్యూస్‌ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఎంటర్‌టైన్మెంట్‌ యాంకర్‌గా మారిన బ్యూటీ అనసూయ. జబర్దస్త్‌ షోతో అనసూయ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. గ్లామరస్‌ యాంకర్‌గా కొనసాగుతూనే ఫ్యామిలీ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది అనసూయ. అయితే అందరికీ అనసూయ న్యూస్‌ యాంకర్‌గా మాత్రమే పరిచయం, కానీ అంతకు ముందే ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన నాగ సినిమాలో చిన్న రోల్ లో నటించింది. అంటే 16 ఏళ్ల కిందే నటిగా వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ ఈ నేపథ్యంలో అనసూయ వయసెంత అన్న అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ అనుమానాలపై ఇటీవల ఓ షో ద్వారా క్లారిటీ ఇచ్చింది అనసూయ. ఓ టీవీ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అనసూయ షోలో భాగంగా తన వయసు ఎంతో వెల్లడించింది.

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ హైకోర్టు స్టే

మూడు రాజధానుల బిల్లుపై  ఈ నెల 14 వరకూ  స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

టిక్‌టాక్‌కు డెడ్‌లైన్‌ విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

చైనాకు చెందిన యాప్‌లను నిషేధించాలంటూ అమెరికాలో డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సంస్థ కార్యాలయాన్ని వేరే దేశానికి మార్చాలని టిక్‌టాక్‌ ప్రయత్నిస్తుండగా,  టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు చేశారు. తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆ యాప్‌ను అమెరికాలో నిషేధిస్తామని చెప్పారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను తమ దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి 6 వారాల గడువు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అంటే సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ ముగియాలని చెప్పారు. టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ లేదా మరో పెద్ద సంస్థకు విక్రయించాలని ఆయన చెప్పారు. భద్రత విషయంలో తమకు ఎలాంటి సమస్య ఉండకూడదన్నారు. ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని తెలిపారు. కాగా, టిక్‌టాక్‌ యాప్ కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేస్తామని మైక్రోసాఫ్ట్‌ కూడా తెలిపిన విషయం తెలిసిందే....

కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కరోనా మృతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చు కోసం రూ. 15 వేలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్లాస్మాను దానం చేసే వారికి రూ. 5 వేలు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. దీని కోసం జిల్లా కలెక్టర్లకు రూ. 12 కోట్ల చొప్పున విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ను ఆదేశించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

గుంటూరు జిల్లాలో దారుణం.. అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టరుతో తొక్కి చంపిన వైనం!

గుంటూరు జిల్లా నకిరేకల్లు శివారులోని శివాపురం తండాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. పొలం తాకట్టు పెట్టి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ట్రాక్టరుతో తొక్కించి చంపేశాడో దుర్మార్గుడు. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రమావత్ మంత్య్రానాయక్ , మంత్రుబాయి (55) దంపతులు తమకున్న రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. సాగుతోపాటు ఇతర అవసరాలకు రెండేళ్ల క్రితం వీరు నకిరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద పొలం తాకట్టుపెట్టి రూ. 3.80 లక్షలు అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించాలంటూ గత కొంతకాలంగా శ్రీనివాసరెడ్డి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. లేకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ క్రమంలో బాధిత దంపతులు పొలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి ట్రాక్టరుతో తండాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించాడు.  అయితే, పొలం సాగు చేసుకుని కొంచెంకొంచెంగా అప్పు తీరుస్తామని చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో వారి మధ్...

దారి పొడుగునా జడ్జిలకు దణ్ణాలు పెట్టిన అమరావతి రైతులు

 అమరావతి రైతుల మానవహారం మూ డు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్‌ యాక్సిస్‌ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు నినదించారు.  ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ... ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక పక్షంగా  సీఆర్డీఏ బిల...

ప్రజాకవి వంగపండు ప్రసాదరావు కన్నుమూత

ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన  ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. విజయనగరం జిల్లా పెదబొండపల్లికి చెందిన వంగపండు  గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1943లో జ‌న్మించిన వంగ‌పండు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుగాంచారు. 1972లో  జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో గిరిజనులను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు  2017లో కళారత్న పురస్కారం లభించింది. వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వంగపండు అని ప్రశంసించారు.  

కరోనా బారినపడిన దర్శకుడు తేజ

  తెలుగు చిత్ర పరిశ్రమ లో కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కరోనా బారినపడ్డారు. తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే తేజ కు తప్ప అందరికి నెగిటివ్ వచ్చింది .  ప్రస్తుతం తేజ హోమ్ క్క్వరంటీన్లో ఉన్నట్టు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ చేతికి టిక్ టాక్

టిక్ టాక్ ను కొనుగోలు చేస్తున్నాం సెప్టెంబర్ 15 కల్లా చర్చలను పూర్తి  చేస్తాం వాటాల కోసం ఇతర సంస్థలు కూడా ఆహ్వానిస్తుంది టిక్ టాక్ ను అమ్మేందుకు దాని మాతృ సంస్థ బైట్ డాన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. ఇప్పుడు అది నిజమవుతోంది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజి ల్యాండ్ లలో టిక్ టాక్ నిర్వహణ బాధ్యతలను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 15 నాటికి ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశముందంది. వాటాల కోసం ఇతర సంస్థలు కూడా ఆహ్వానిస్తుంది సమాచార భద్రతకు ముప్పు రాకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికాకు ఆర్థిక లాభం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అమెరికా పౌరుల డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలతో పంచుకోబోమని స్పష్టం చేసింది. అమెరికా సమాచారం పొరపాటున ఇతర దేశాల్లోని సర్వర్లలోకి వెళ్లి ఉంటే… వాటిని శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

కరోనా ‘ఖతమైందా?’, చైనాలో ఇక బీర్ ఫెస్టివల్

చైనాలో ఏటా జరిగే బీర్ ఫెస్టివల్ ఈ నెల 1 న ప్రారంభమైంది. వేల మంది చైనీయులు కరోనా భయాన్ని, ఫేస్ మాస్కులను వదిలేసి బీర్ రుచి కోసం తహతహలాడుతున్నారు. ‘కింగ్ డావో ‘ పేరిట ఈ ‘బీరోత్సవం’ ఈ నెలాఖరు వరకు జరుగుతుందట. సుమారు 1500 రకాల బీర్ రుచులను ఆస్వాదించే చైనీయులు తాగుతూ, తింటూ షో లు చూస్తూ ఎంజాయ్ చేయడమే పనిగాపెట్టుకోనున్నారు. కేవలం ఒక్క సాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోనే వందలాది స్థానికులు పొడవాటి టేబుల్స్ ముందు కూర్చుని ‘బీరు పానం’ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చైనాలో అసలు కరోనా వైరస్ ‘ఖత’మైనట్టే ఉందని విదేశీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తన దేశంలో కరోనా వైరస్ ని చాలావరకు నియంత్రించుకున్న చైనా.. ఇక వినోద కార్యక్రమాల పైనా దృష్టి పెట్టింది. అయితే రష్యా నుంచి వచ్చే తమ దేశీయులే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ఇంపోర్టెడ్ కేసులతో తల్లడిల్లుతోంది.

రాముడి గుడి భూమి పూజకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా..!

    రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై... అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సరయూ నది ఒడ్డున ఉన్న సాకేతపురి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వెలుగు జిలులుగులతో ప్రకాశిస్తున్నశ్రీరామనగరిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నగరం మొత్తం స్వాగత తోరణాలు కడుతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి విచ్చేస్తున్న అతిరథ మహారథుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా వాదన వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. ఇక్బాల్ అన్సారీకి ముందు ఆయన తండ్రి హషీమ్ అన్సారీ.. బాబ్రీ మసీదు- రామజన్మభూమి వివాదంపై న్యాయ పోరాటం చేశారు. ఆయన 95 ఏళ్ల వయ...

ఇవాళ చేసిన రెండు పనులు మనసుకు ఎంతో

ఈ-రక్షాబంధన్ ప్రారంభించడానికి ముందు ఇవాళ ఉదయం ఆసరా, చేయూత వంటి మహిళలకు సాధికారత కల్పించే కార్యక్రమాలకు ఉపయోగపడే కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గేంబుల్, అమూల్ వంటి సంస్థల సహకారంతో బ్యాంకుల ద్వారా ప్రతి ఇంట్లో ఓ మహిళకు నాలుగేళ్ల పాటు నికర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇక ఈ-రక్షాబంధన్ లోగో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,  సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ-రక్షాబంధన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణ ఎలాగన్నదానిపై నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఉంటాయని అన్నారు. అందుకోసం 4ఎస్ 4యూ అనే పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలకు గురయ్యే మహిళలకు సైబర్ మిత్ర యాప్ ద్వారా, లేక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేకపోతే నిర్దేశిత టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.  అంతేకాదు, ఈ-రక్షాబంధన్ కార్యక్రమంపై షార్ట్ ఫిలింలు, యానిమేషన్ క...

గెజిట్ పై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును ఇటీవలే గవర్నర్ ఆమోదించగా, ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాజధాని రైతు పరిరక్షణ సమితి స్పందించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గెజిట్ అమలు నిలిపివేయాలని, సీఎం కార్యాలయం, రాజ్ భవన్, సెక్రటేరియట్ ను ఇక్కడి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును కోరింది. కాగా, ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.  

జనసేన ఎమ్మెల్యేతో పవన్ కల్యాణ్

అమరావతి రైతులకు టీడీపీ నేత బీటెక్ రవి సంఘీభావం ప్రకటించారు. ఈరోజు ఆయన అమరావతి ప్రాంతంలోని రైతుల నిరసన శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులను నిరసిస్తూ తాను ఇప్పటికే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించానని... ఇప్పుడు ఛైర్మన్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా పదవులకు రాజీనామా చేయాలని కోరారు. రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారని... ముందు జనసేన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని అన్నారు. అమరావతి విషయంలో పవన్ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు

ఏపీ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా... భార్యకు కూడా పాజిటివ్..

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా బారినపడ్డారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది.  కోన రఘుపతి భార్యకి కూడా కరోనా సోకింది. మైల్డ్ గా వచ్చిందని ఎవ్వరూ కంగారు పడొద్దని వైద్యుల సూచన మేరకు వారం రోజులు హోమ్ క్వారన్టైన్  లో ఉంటున్నామని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని తెలిపారు

టిక్ టాక్ పై అధికారిక ప్రకటన చేసిన మైక్రోసాఫ్ట్

సస్పెన్స్ కు తెరపడింది. ప్రముఖ వీడియో మెసేజింగ్ యాప్ టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఓ మైక్రో బ్లాగ్ పోస్ట్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. టిక్ టాక్ ను కొనుగోలు చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సవివరంగా ప్రకటనను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరాలను అర్థం చేసుకున్నామని... సమాచార భద్రతకు ముప్పు రాకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికాకు ఆర్థిక లాభం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అమెరికా పౌరుల డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలతో పంచుకోబోమని స్పష్టం చేసింది. అమెరికా సమాచారం పొరపాటున ఇతర దేశాల్లోని సర్వర్లలోకి వెళ్లి ఉంటే... వాటిని శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.  

Xiaomi కొత్త ఎత్తుగడ : స్మార్ట్ ఫోన్ లోపలే ఇయర్ ఫోన్స్

 కొత్త కొత్త ప్రయోగాలతో, ఇప్పటి వరకూ చాలా వినూత్నమైన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే తీసుకొచ్చిన షియోమీ, ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఫోన్ తీసుకురానున్నట్లు పక్కగా తెలుస్తోంది. ఎందుకంటే, Xiaomi కొత్త తరహాలో కనిపించేలా ఒక స్మార్ట్ ఫోన్ తయారు చెయ్యడానికి తీసుకున్న పేటెంట్స్ లో, వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ను ఫోన్ లోపలే అమర్చే విధంగా కొత్త విధానం పరిచయం చేయనున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, అండర్ స్క్రీన్ కెమెరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం, ఇటువంటి ప్రత్యేకతలతో, పూర్తి స్క్రీన్ స్మార్ట్ ‌ఫోన్ కోసం షియోమి పేటెంట్ చేస్తోంది. ఈ పేటెంట్ రెండర్స్ (నమూనా) ఫోన్‌ పైభాగంలో ఇయర్‌ బడ్స్‌ స్లాట్ ‌ను స్థూపాకార షాఫ్ట్ ‌లుగా చూపిస్తాయి, ఇది లౌడ్‌స్పీకర్ ‌గా కూడా ఉపయోగపడుతుందని కూడా అనిపిస్తుంది. ఊహించని విధంగా, చాలా చమత్కారంగా కనిపించే బోల్డ్ డిజైన్ ఐడియాల పైన ఆసక్తి చూపడం, షియోమికి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాల సార్లు కూడా సాధారణ స్మార్ట్ ‌ఫోన్ డిజైన్లను పక్కన పెట్టి,  Mi Mix మరియు Mix Alpha వంటి ఫోన్ ‌లను విడుదల ...

Vivo V19 : రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో అమ్మడవుతోంది

ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది. ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. Vivo అభిమానులకు శుభవార్త ! వివో సంస్థ, ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది. అంతేకాదు, ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.             Vivo V 19  లేటెస్ట్ ప్రైస్ వివో వి 19 యొ...

త్రిభాషా సూత్రం అమలు చేయం : సీఎం పళనిస్వామి

కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ విధానం తమకు అత్యంత బాధా, విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విధానాన్ని ఎంత మాత్రమూ అమలు చేయమని స్పష్టం చేశారు. ఆ నూతన విధానంపై మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘నూతన విద్యా విధానంలోని త్రి భాషా సూత్రం అత్యంత బాధాకరం. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయా విధానాల ప్రకారం రాష్ట్రాలను అమలు చేయనివ్వండి’’ అని సీఎం పళని స్వామి సూచించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

  నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుందన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానన్నారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియ చేశామని రమేష్ కుమార్ వెల్లడించారు.  హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీగా తిరిగి రమేష్ కుమార్‌ను నియమిస్తూ గత గురువారం అర్థారత్రి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. దీంతో ఆగ్రహించిన ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీ పదవీకాలాన్ని ‘సంస్కరణల’ పేరిట కుదిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తక్షణమే నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిందని ఆయనను తొలగించింది. అంతే కాదు.. మరో అడుగు ముందుకేసి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది. దీంతో నిమ్మగడ్డ న్యాయపోరాటానికి దిగారు. ఆయన విషయంలో ...