ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా బారినపడ్డారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. కోన రఘుపతి భార్యకి కూడా కరోనా సోకింది. మైల్డ్ గా వచ్చిందని ఎవ్వరూ కంగారు పడొద్దని వైద్యుల సూచన మేరకు వారం రోజులు హోమ్ క్వారన్టైన్ లో ఉంటున్నామని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని తెలిపారు
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment