Skip to main content

Xiaomi కొత్త ఎత్తుగడ : స్మార్ట్ ఫోన్ లోపలే ఇయర్ ఫోన్స్


 కొత్త కొత్త ప్రయోగాలతో, ఇప్పటి వరకూ చాలా వినూత్నమైన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే తీసుకొచ్చిన షియోమీ, ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఫోన్ తీసుకురానున్నట్లు పక్కగా తెలుస్తోంది. ఎందుకంటే, Xiaomi కొత్త తరహాలో కనిపించేలా ఒక స్మార్ట్ ఫోన్ తయారు చెయ్యడానికి తీసుకున్న పేటెంట్స్ లో, వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ను ఫోన్ లోపలే అమర్చే విధంగా కొత్త విధానం పరిచయం చేయనున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, అండర్ స్క్రీన్ కెమెరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం, ఇటువంటి ప్రత్యేకతలతో, పూర్తి స్క్రీన్ స్మార్ట్ ‌ఫోన్ కోసం షియోమి పేటెంట్ చేస్తోంది. ఈ పేటెంట్ రెండర్స్ (నమూనా) ఫోన్‌ పైభాగంలో ఇయర్‌ బడ్స్‌ స్లాట్ ‌ను స్థూపాకార షాఫ్ట్ ‌లుగా చూపిస్తాయి, ఇది లౌడ్‌స్పీకర్ ‌గా కూడా ఉపయోగపడుతుందని కూడా అనిపిస్తుంది.

ఊహించని విధంగా, చాలా చమత్కారంగా కనిపించే బోల్డ్ డిజైన్ ఐడియాల పైన ఆసక్తి చూపడం, షియోమికి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాల సార్లు కూడా సాధారణ స్మార్ట్ ‌ఫోన్ డిజైన్లను పక్కన పెట్టి,  Mi Mix మరియు Mix Alpha వంటి ఫోన్ ‌లను విడుదల చేసిన షియోమి కి, కొత్త డిజైన్లతో ఫోన్లను లాంచ్ చేసిన చరిత్ర ఉంది.

కొత్త పేటెంట్ల నుండి ప్రేరణ పొంది, LetsGoDigital వారి ఆలోచన ప్రకారం ఊహాచిత్రాలను, డిజైన్ రెండర్‌ లను క్రియేట్ చేసింది.


రెండు పేటెంట్ల ప్రకారం, ఫోన్ పైభాగంలో రెండు రంధ్రాలు ఉంటాయి, అవి వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ ను కలిగి ఉంటాయి. షాఫ్ట్‌లో ఉంచినప్పుడు ఈ ఇయర్‌ బడ్స్  పైకి చూపిస్తాయి, అయితే ఇది చెవులకు బాగా సరిపోయేలా వివిధ కోణాల్లో ఇరుసుగా ఉంటుంది. నోట్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో శామ్సంగ్ ఎస్-పెన్ను ఎలా అందిస్తుంది అనేదానికి ఈ ఆలోచన చాలా పోలి ఉంటుంది.

దాని రూపాన్ని బట్టి, ఇయర్‌ బడ్‌లు స్లాట్‌ లో ఉన్నప్పుడు లౌడ్ ‌స్పీకర్‌గా కూడా మార్చుకోవచ్చు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...