Skip to main content

Xiaomi కొత్త ఎత్తుగడ : స్మార్ట్ ఫోన్ లోపలే ఇయర్ ఫోన్స్


 కొత్త కొత్త ప్రయోగాలతో, ఇప్పటి వరకూ చాలా వినూత్నమైన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే తీసుకొచ్చిన షియోమీ, ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఫోన్ తీసుకురానున్నట్లు పక్కగా తెలుస్తోంది. ఎందుకంటే, Xiaomi కొత్త తరహాలో కనిపించేలా ఒక స్మార్ట్ ఫోన్ తయారు చెయ్యడానికి తీసుకున్న పేటెంట్స్ లో, వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ను ఫోన్ లోపలే అమర్చే విధంగా కొత్త విధానం పరిచయం చేయనున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, అండర్ స్క్రీన్ కెమెరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం, ఇటువంటి ప్రత్యేకతలతో, పూర్తి స్క్రీన్ స్మార్ట్ ‌ఫోన్ కోసం షియోమి పేటెంట్ చేస్తోంది. ఈ పేటెంట్ రెండర్స్ (నమూనా) ఫోన్‌ పైభాగంలో ఇయర్‌ బడ్స్‌ స్లాట్ ‌ను స్థూపాకార షాఫ్ట్ ‌లుగా చూపిస్తాయి, ఇది లౌడ్‌స్పీకర్ ‌గా కూడా ఉపయోగపడుతుందని కూడా అనిపిస్తుంది.

ఊహించని విధంగా, చాలా చమత్కారంగా కనిపించే బోల్డ్ డిజైన్ ఐడియాల పైన ఆసక్తి చూపడం, షియోమికి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాల సార్లు కూడా సాధారణ స్మార్ట్ ‌ఫోన్ డిజైన్లను పక్కన పెట్టి,  Mi Mix మరియు Mix Alpha వంటి ఫోన్ ‌లను విడుదల చేసిన షియోమి కి, కొత్త డిజైన్లతో ఫోన్లను లాంచ్ చేసిన చరిత్ర ఉంది.

కొత్త పేటెంట్ల నుండి ప్రేరణ పొంది, LetsGoDigital వారి ఆలోచన ప్రకారం ఊహాచిత్రాలను, డిజైన్ రెండర్‌ లను క్రియేట్ చేసింది.


రెండు పేటెంట్ల ప్రకారం, ఫోన్ పైభాగంలో రెండు రంధ్రాలు ఉంటాయి, అవి వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ ను కలిగి ఉంటాయి. షాఫ్ట్‌లో ఉంచినప్పుడు ఈ ఇయర్‌ బడ్స్  పైకి చూపిస్తాయి, అయితే ఇది చెవులకు బాగా సరిపోయేలా వివిధ కోణాల్లో ఇరుసుగా ఉంటుంది. నోట్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో శామ్సంగ్ ఎస్-పెన్ను ఎలా అందిస్తుంది అనేదానికి ఈ ఆలోచన చాలా పోలి ఉంటుంది.

దాని రూపాన్ని బట్టి, ఇయర్‌ బడ్‌లు స్లాట్‌ లో ఉన్నప్పుడు లౌడ్ ‌స్పీకర్‌గా కూడా మార్చుకోవచ్చు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...