Skip to main content

Vivo V19 : రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో అమ్మడవుతోంది



ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది.

Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది.

ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.

Vivo అభిమానులకు శుభవార్త ! వివో సంస్థ, ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది. అంతేకాదు, ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.            

Vivo V 19  లేటెస్ట్ ప్రైస్

వివో వి 19 యొక్క 8 జిబి + 128 జిబి వేరియంట్ ధర ముందుగా రూ .27,990 కాగా ప్రస్తుతం రూ .24,990 ధరతో అమ్ముడవుతోంది, 8 జిబి + 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ముందుగా Rs. 31,990 రూపాయలకు అమ్మడవగా, ప్రస్తుతం 27,990 రుపాయల ధరతో అమ్ముడవుతోంది. ఈ ఫోన్ పియానో ​​బ్లాక్ మరియు మిస్టిక్ సిల్వర్ కలర్‌లో లభిస్తుంది.

Vivo V 19 : ప్రత్యేకతలు

వివో వి 19 పంచ్-హాల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ఒక 6.44-అంగుళాల FHD + డిస్ప్లే ను 2400 x 1080 పిక్సెళ్ల  రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, ఇందులో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది కాకుండా, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC శక్తిని కలిగి ఉంది మరియు ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజితో జతచేయబడుతుంది.

Vivo V 19  : కెమేరా 

ఈ ఫోన్‌ ముందుభాగంలో, ఒక 32 మెగాపిక్సెల్ పంచ్-హోల్ కెమెరా లభిస్తోంది, దీనికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ మద్దతు ఉంది. అంటే, ఇది డ్యూయల్ సెల్ఫీ కెమేరాతో వస్తుంది.  ఇది కాకుండా, ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా ఉంది, దీనిలో 48 మెగాపిక్సెల్స్ ప్రాధమిక కెమెరా ఉంది మరియు ఇది ఎపర్చరు ఎఫ్ / 1.8 తో ఉంటుంది మరియు ఇది ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో (PDAF) తో వస్తుంది.

రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డేడికేటెడ్ మాక్రో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 9.2 లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్, మిస్టిక్ సిల్వర్ మరియు గ్లీమ్ బ్లాక్ వంటి రెండు రంగుల ఎంపికలలో వస్తుంది.


Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...