Skip to main content

దారి పొడుగునా జడ్జిలకు దణ్ణాలు పెట్టిన అమరావతి రైతులు

 అమరావతి రైతుల మానవహారం


మూ
డు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్‌ యాక్సిస్‌ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు నినదించారు. 


ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ... ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక పక్షంగా  సీఆర్డీఏ బిల్లును రద్దు చేశారని ఆరోపించారు.


మరో వైపు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతిపై చేసిన ప్రకటనల క్లిప్పింగ్‌లను ఫిర్యాదుకు జత చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.