Skip to main content

దారి పొడుగునా జడ్జిలకు దణ్ణాలు పెట్టిన అమరావతి రైతులు

 అమరావతి రైతుల మానవహారం


మూ
డు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్‌ యాక్సిస్‌ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు నినదించారు. 


ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ... ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక పక్షంగా  సీఆర్డీఏ బిల్లును రద్దు చేశారని ఆరోపించారు.


మరో వైపు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతిపై చేసిన ప్రకటనల క్లిప్పింగ్‌లను ఫిర్యాదుకు జత చేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...