Skip to main content

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ తిరస్కరణ

సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని వాదించారు. తెలుగులో బోధన వల్ల పాఠశాలల్లో నమోదు తగ్గిపోతోందని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టేకూడా ఇవ్వాలని విశ్వనాథన్‌ ధర్మాసనాన్ని కోరారు.

ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది శంకర్‌ నారాయణన్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు మాధ్యమం ఎంపిక అకాశాన్ని కాలరాస్తోందన్నారు. తెలుగు మాధ్యమ పాఠశాలలను కనుమరుగు చేసే యత్నం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. ప్రతివాదులు అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాత స్టేపై పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేవియట్‌ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...