Skip to main content

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్


 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది.

సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ

సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు.

సభ్యులు వీరే..

మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఏఎంఆర్డీఏలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. ఆర్థికశాఖ ముఖ్యయ కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్, మున్సిపల్ పరిధిలో ఉండే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం డైరెక్టర్, గుంటూరు ఉప రవాణా కమిషనర్, గుంటూరు జిల్లా రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్, కృష్ణా జిల్లా రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్, ట్రాన్స‌్‌కో విజయవాడ సూపరింటెండెంట్ ఇంజినీర్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సభ్య సమన్వయకుడిగా వ్యవహరిస్తారు.

ఏఎంఆర్డీఏ పరిధిలోనే

గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి ప్రాంతాలను ఏఎంఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తారని తెలుస్తోంది. రాజధాని ప్రాంత రైతులు నష్టపోకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏఎంఆర్డీఏ పరిధిలోకి వాటిని తీసుకుని రావడం వల్ల భూముల విలువ తగ్గకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధులను విలీనం చేస్తూ.. ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించడానికి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా- వాటి పరిధిలోని ప్రాంతాలను ఏఎంఆర్డీఏ కిందికి చేర్చుతారని అంటున్నారు.

సీఆర్డీఏకు ఉన్న ప్రాధాన్యతను కొనసాగించేలా..

ఇదివరకు సీఆర్డీఏకు ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గకుండా అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అంటున్నారు. అమరావతి పరిధి మొత్తాన్నీ దశలవారీగా మెట్రోపాలిటన్ హోదా కిందికి తీసుకుని రావడం వల్ల భూములు, ప్లాట్ల ధరల్లో క్షీణించే అవకాశం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా- రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఎంఆర్డీఏను అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడా రాజీపడకూడదంటూ మున్సిపల్ శాఖను సూచించినట్లు సమాచారం.


    Comments

    Popular posts from this blog

    సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

    బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

    చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

    విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...