Skip to main content

ట్రంప్‌కు మళ్లీ షాకిచ్చిన ట్విట్టర్.. ట్వీట్ తొలగింపు..




 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్టర్ మరోమారు తొలగించింది. యూఎస్‌లో కేవలం 6 శాతం మంది మాత్రమే కరోనా కారణంగా మరణించారని, మిగతా 94 శాతం మంది వివిధ వ్యాధుల కారణంగా మరణించినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొందంటూ ట్రంప్ మద్దతుదారుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు.

నిజానికి సీడీసీ ఇలా చెప్పలేదు. 6 శాతం మందికి అది జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల్లో వారి మరణానికి కారణం కరోనా అని ప్రస్తావించింది. మిగతా వారు కరోనాతోపాటు, ఇతర వ్యాధుల కారణంగా మరణించినట్టు పేర్కొంది. అయితే, ట్రంప్ మద్దతుదారుడు మాత్రం దానిని వేరేలా అన్వయించుకుని ట్వీట్ చేశాడు. దానిని ట్రంప్ రీట్వీట్ చేశారు. దీంతో ట్రంప్ రీట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది. గతంలోనూ ట్రంప్ ట్వీట్లు ఇలాంటి కారణాలతో  పలుమార్లు తొలగింపునకు గురయ్యాయి.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.