Skip to main content

ఇక హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫికేషన్ తప్పనిసరి!



ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలకు గురికాకుండా, తప్పనిసరిగా బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) ప్రమాణాలకు అనుగుణంగా హెల్మెట్లను తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. దీనిపై ఆసక్తిగలవారు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునని తెలిపింది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, 2016 ప్రకారం తప్పనిసరిగా ద్విచక్ర వాహనాల రైడర్ కోసం రక్షణ హెల్మెట్లను తీసుకురావడానికి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసింది. ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తే లోకల్ హెల్మెట్లను ధరించే ద్విచక్ర వాహనదారులు చలానా చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లనే తయారు చేసి, భారత దేశంలో విక్రయించవలసి ఉంటుంది. బీఐఎస్ సర్టిఫైడ్ కానటువంటి హెల్మెట్లను తయారు చేసే కంపెనీల యాజమాన్యాలు కూడా జైలు శిక్ష, జరిమానాలకు పాత్రులవుతారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.