Skip to main content

రిలయన్స్‌తో టిక్‌టాక్‌ చర్చలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ భారత్‌లో పునరాగమనానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో ఉన్న తన యూజర్‌ బేస్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు 


భారత్‌లో తన వ్యాపారాన్ని విక్రయించే అంశంపై చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ చర్చలు జరిపినట్లు ‘టెక్ క్రంచ్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది.

గత నెలలోనే ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు తెలిసింది. అయితే, ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది. దీనిపై అటు రిలయన్స్‌గానీ, ఇటు బైట్‌ డ్యాన్స్‌ గానీ స్పందించలేదు. మరోవైపు అమెరికాలో సైతం ఈ యాప్‌ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో ఆ సంస్థ చర్చలు జరుపుతోంది. అదే క్రమంలో ఇండియా కార్యకలాపాలను కూడా మైక్రోసాఫ్టే కొనుగోలు చేయనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ట్విటర్‌ కూడా టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...