కరోనా ఎఫెక్ట్ బీర్ల అమ్మకాలపై కూడా పడింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ విషయం తెలంగాణ మద్యం అమ్మకాల లెక్కల ద్వారా భయటపడింది. ఆల్కహాల్ బెవరేజస్లో విపరీతంగా అమ్ముడుపోయే ఆల్కహాల్ బీర్ కాగా ఇప్పుడు బీర్లు కొనాలంటేనే భయపడుతున్నారు. చల్లని బీర్లు తాగితే జలుబు రావచ్చనే కారణంగానే వాటిని తాగటానికి మందుబాబులు భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లో బీర్ల అమ్మకాలు తగ్గాయని షాపు యజమానులు చెబుతున్నారు. మరోవైపు సాధారణ రోజుల్లో జరిగిన పార్టీలు, వేడుకలతో పోలిస్తే ప్రస్తుతం పార్టీలు, వేడుకలు కూడా తగ్గటం మరో కారణమని అంచనావేస్తున్నారు. హైదరాబాద్ లోను గతంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరగగా 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. అయితే ఈ జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరగగా బీరు అమ్మకాలు మాత్రం 22.99 లక్షల కేసులు జరిగాయి. ఈ లెక్కలు చూస్తుంటే బీర్ల అమ్మకాలు సగానికి పడిపోయినట్టు తెలుస్తోంది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment