Skip to main content

బీర్లకు తగ్గిన డిమాండ్..ఎందుకంటే..!



కరోనా ఎఫెక్ట్ బీర్ల అమ్మకాలపై కూడా పడింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ విషయం తెలంగాణ మద్యం అమ్మకాల లెక్కల ద్వారా భయటపడింది. ఆల్కహాల్ బెవరేజస్‌లో విపరీతంగా అమ్ముడుపోయే ఆల్కహాల్ బీర్ కాగా ఇప్పుడు బీర్లు కొనాలంటేనే భయపడుతున్నారు. చల్లని బీర్లు తాగితే జలుబు రావచ్చనే కారణంగానే వాటిని తాగటానికి మందుబాబులు భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లో బీర్ల అమ్మకాలు తగ్గాయని షాపు యజమానులు చెబుతున్నారు. మరోవైపు సాధారణ రోజుల్లో జరిగిన పార్టీలు, వేడుకలతో పోలిస్తే ప్రస్తుతం పార్టీలు, వేడుకలు కూడా తగ్గటం మరో కారణమని అంచనావేస్తున్నారు. హైదరాబాద్ లోను గతంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగగా 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. అయితే ఈ జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగగా బీరు అమ్మకాలు మాత్రం 22.99 లక్షల కేసులు జరిగాయి. ఈ లెక్కలు చూస్తుంటే బీర్ల అమ్మకాలు సగానికి పడిపోయినట్టు తెలుస్తోంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...