Skip to main content

చిరు, విజయశాంతిలను అనుకరిస్తూ దంపతుల డ్యాన్స్.. చూసి ఆశ్చర్యపోయి, అభినందించిన మెగాస్టార్‌!



శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..అనంతరం పలు సినిమాలు చేసి టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన నటుడు సుధాకర్ కోమాకుల తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలోని ఓ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు.

'ఇందువదన కుందరదన.. మందగమన మధురవచన.. గగన జఘన సొగసు లలనవే.. ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారికా' అంటూ ఆ భార్యాభర్తలు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఛాలెంజ్‌ సినిమాలో ఈ పాటకు చిరుతో కలిసి విజయశాంతి డ్యాన్స్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సుధాకర్ దంపతులు వారిని అనుకరిస్తూ డ్యాన్స్‌ చేసి చిరుకి గిఫ్ట్ ఇచ్చారు. దీంతో దీనిపై చిరంజీవి స్పందించారు.

'హాయ్ డియర్‌ సుధాకర్, హారిక ఎలా ఉన్నారు? నా పుట్టినరోజు నాడు మీరు ఇచ్చిన ట్రీట్‌కి కృతజ్ఞతలు. ఛాలెంజ్ సినిమాలోని ఆ డ్యాన్స్‌ను నాకు గుర్తు చేశారు. మీకు వచ్చిన ఈ ఆలోచన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు అమెరికాలో ఉన్నారు. మీరు భారత్‌లో ఉంటే నా సంతోషాన్ని మరోలా తెలిపేవాడినేమో. హారిక టెక్కీగా పనిచేస్తూ నీతో కలిసి ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది' అని చిరంజీవి అన్నారు. ఇందుకు సంబంధించిన వాయిస్‌ను పోస్ట్ చేస్తూ సుధాకర్ హర్షం వ్యక్తం చేశాడు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...