Skip to main content

చిరు, విజయశాంతిలను అనుకరిస్తూ దంపతుల డ్యాన్స్.. చూసి ఆశ్చర్యపోయి, అభినందించిన మెగాస్టార్‌!



శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..అనంతరం పలు సినిమాలు చేసి టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన నటుడు సుధాకర్ కోమాకుల తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలోని ఓ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు.

'ఇందువదన కుందరదన.. మందగమన మధురవచన.. గగన జఘన సొగసు లలనవే.. ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారికా' అంటూ ఆ భార్యాభర్తలు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఛాలెంజ్‌ సినిమాలో ఈ పాటకు చిరుతో కలిసి విజయశాంతి డ్యాన్స్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సుధాకర్ దంపతులు వారిని అనుకరిస్తూ డ్యాన్స్‌ చేసి చిరుకి గిఫ్ట్ ఇచ్చారు. దీంతో దీనిపై చిరంజీవి స్పందించారు.

'హాయ్ డియర్‌ సుధాకర్, హారిక ఎలా ఉన్నారు? నా పుట్టినరోజు నాడు మీరు ఇచ్చిన ట్రీట్‌కి కృతజ్ఞతలు. ఛాలెంజ్ సినిమాలోని ఆ డ్యాన్స్‌ను నాకు గుర్తు చేశారు. మీకు వచ్చిన ఈ ఆలోచన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు అమెరికాలో ఉన్నారు. మీరు భారత్‌లో ఉంటే నా సంతోషాన్ని మరోలా తెలిపేవాడినేమో. హారిక టెక్కీగా పనిచేస్తూ నీతో కలిసి ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది' అని చిరంజీవి అన్నారు. ఇందుకు సంబంధించిన వాయిస్‌ను పోస్ట్ చేస్తూ సుధాకర్ హర్షం వ్యక్తం చేశాడు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...