Skip to main content

చిరు, విజయశాంతిలను అనుకరిస్తూ దంపతుల డ్యాన్స్.. చూసి ఆశ్చర్యపోయి, అభినందించిన మెగాస్టార్‌!



శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..అనంతరం పలు సినిమాలు చేసి టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన నటుడు సుధాకర్ కోమాకుల తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలోని ఓ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు.

'ఇందువదన కుందరదన.. మందగమన మధురవచన.. గగన జఘన సొగసు లలనవే.. ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారికా' అంటూ ఆ భార్యాభర్తలు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఛాలెంజ్‌ సినిమాలో ఈ పాటకు చిరుతో కలిసి విజయశాంతి డ్యాన్స్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సుధాకర్ దంపతులు వారిని అనుకరిస్తూ డ్యాన్స్‌ చేసి చిరుకి గిఫ్ట్ ఇచ్చారు. దీంతో దీనిపై చిరంజీవి స్పందించారు.

'హాయ్ డియర్‌ సుధాకర్, హారిక ఎలా ఉన్నారు? నా పుట్టినరోజు నాడు మీరు ఇచ్చిన ట్రీట్‌కి కృతజ్ఞతలు. ఛాలెంజ్ సినిమాలోని ఆ డ్యాన్స్‌ను నాకు గుర్తు చేశారు. మీకు వచ్చిన ఈ ఆలోచన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు అమెరికాలో ఉన్నారు. మీరు భారత్‌లో ఉంటే నా సంతోషాన్ని మరోలా తెలిపేవాడినేమో. హారిక టెక్కీగా పనిచేస్తూ నీతో కలిసి ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది' అని చిరంజీవి అన్నారు. ఇందుకు సంబంధించిన వాయిస్‌ను పోస్ట్ చేస్తూ సుధాకర్ హర్షం వ్యక్తం చేశాడు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...