Skip to main content

జగన్ మూడు రాజధానుల సక్సెస్ పై రాజమౌళి ఫుల్ హ్యాపీస్...? |


తెలుగు స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావడంపై చాలా ఖుషీగా ఉన్నారట. దర్శకధీరుడు కి అసలు ఏపీ రాజకీయాల తో పనేంటి అని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే.

గతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు చంద్రబాబు బాహుబలి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ని హుటాహుటిన క్యాపిటల్ ప్రాంతానికి పిలిపించారు. అతనిని అమరావతి కట్టడాలకు కి సంబంధించిన కొన్ని డెమో మోడల్స్ ను తయారు చేయమని మరియు ఏ రకంగా ఒక రాజధాని కడితే ప్రజలకు బాగుంటుందో సూచించమని అడిగారు. మాహిష్మతి సృష్టికర్త అయిన రాజమౌళి ఎలాంటి మోడల్స్ ను అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఆయన దాని పట్ల చంద్ర బాబు సంతృప్తి చెందలేదని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక తాను కూడా మర్యాదపూర్వకంగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా తెలిపారు. అంత పెద్దగా దానిమీద వర్క్ చేసే అవకాశం రాలేదని ఆదిలోనే ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలిపారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే 2014లో చాలా యాదృశ్చికంగా రాజమౌళి మూడు రాజధానులు నిర్ణయానికి జై కొట్టారు. లోక్ సభ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అప్పటి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను తాను అధికారంలోకి వస్తే నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. ఇలాగే అడ్మినిస్ట్రేటివ్ ఒకచోట, లెజిస్లేటివ్ ఒకచోట మరియు జుడీషియరీ మరో చోట నిర్మిస్తారని తెలిపారు. దీనికి రాజమౌళి తన ఫేస్ బుక్ అకౌంట్ లో “లోక్ సత్తా చెప్పిన సూత్రం ఆంధ్రప్రదేశ్ రాజధానికి చాలా మంచి సొల్యూషన్” అని తను కూడా దానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది.

ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు విషయమై దాదాపు తొమ్మిది నెలలు పోరాడి పంతం నెగ్గించుకున్న సమయంలో రాజమౌళి కచ్చితంగా ఆనందపడే ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సూచించింది కూడా అచ్చం ఇలాంటి మోడలే కాబట్టి రాజమౌళి ఫుల్ ఖుషి అయిపోయి ఉంటాడు అని చెప్పవచ్చు



Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...