Skip to main content

జగన్ మూడు రాజధానుల సక్సెస్ పై రాజమౌళి ఫుల్ హ్యాపీస్...? |


తెలుగు స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావడంపై చాలా ఖుషీగా ఉన్నారట. దర్శకధీరుడు కి అసలు ఏపీ రాజకీయాల తో పనేంటి అని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే.

గతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు చంద్రబాబు బాహుబలి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ని హుటాహుటిన క్యాపిటల్ ప్రాంతానికి పిలిపించారు. అతనిని అమరావతి కట్టడాలకు కి సంబంధించిన కొన్ని డెమో మోడల్స్ ను తయారు చేయమని మరియు ఏ రకంగా ఒక రాజధాని కడితే ప్రజలకు బాగుంటుందో సూచించమని అడిగారు. మాహిష్మతి సృష్టికర్త అయిన రాజమౌళి ఎలాంటి మోడల్స్ ను అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఆయన దాని పట్ల చంద్ర బాబు సంతృప్తి చెందలేదని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక తాను కూడా మర్యాదపూర్వకంగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా తెలిపారు. అంత పెద్దగా దానిమీద వర్క్ చేసే అవకాశం రాలేదని ఆదిలోనే ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలిపారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే 2014లో చాలా యాదృశ్చికంగా రాజమౌళి మూడు రాజధానులు నిర్ణయానికి జై కొట్టారు. లోక్ సభ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అప్పటి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను తాను అధికారంలోకి వస్తే నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. ఇలాగే అడ్మినిస్ట్రేటివ్ ఒకచోట, లెజిస్లేటివ్ ఒకచోట మరియు జుడీషియరీ మరో చోట నిర్మిస్తారని తెలిపారు. దీనికి రాజమౌళి తన ఫేస్ బుక్ అకౌంట్ లో “లోక్ సత్తా చెప్పిన సూత్రం ఆంధ్రప్రదేశ్ రాజధానికి చాలా మంచి సొల్యూషన్” అని తను కూడా దానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది.

ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు విషయమై దాదాపు తొమ్మిది నెలలు పోరాడి పంతం నెగ్గించుకున్న సమయంలో రాజమౌళి కచ్చితంగా ఆనందపడే ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సూచించింది కూడా అచ్చం ఇలాంటి మోడలే కాబట్టి రాజమౌళి ఫుల్ ఖుషి అయిపోయి ఉంటాడు అని చెప్పవచ్చు



Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.