Skip to main content

చేతులకు పది గంటలు గ్లౌజ్ లు వేసుకుంటే... డాక్టర్ షేర్ చేసిన పిక్!

 


కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులే ముందు నిలిచారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. నిరంతరం వైద్యులు పడుతున్న శ్రమతోనే రికవరీల సంఖ్య అధికంగా ఉంటూ, మరణాల రేటు కనిష్ఠానికి పడిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిద్రాహారాలు మాని, ఇంటికి దూరమై, ఆసుపత్రుల్లో చికిత్సలను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలను పణంగా కూడా పెడుతున్నారు. ఊపిరాడని విధంగా పీపీఈ కిట్లు ధరించడంతో పాటు, చేతులకు గ్లౌజులు వేసుకుని గంటల తరబడి విధుల్లో నిమగ్నమై ఉన్నారు.


ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్, 10 గంటల పాటు గ్లౌజ్ లను ధరించడం వల్ల తన చేతులు ఇలా మారిపోయాయంటూ షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు, కరోనా రోగులకు చికిత్స చేసే నిమిత్తం గంటల తరబడి చేతులకు తొడుగులు తొడుక్కోవాల్సి వచ్చింది. ఓ వార్డులో నుంచి పది గంటల పాటు అతను బయటకు రాలేక పోయాడు. కనీసం విశ్రాంతికి కూడా సమయం లేకపోగా, గ్లౌజ్ లను మార్చేందుకు కూడా వీల్లేకపోయింది.

ఆపై రౌండ్స్ తరువాత చేతులకు గ్లౌజ్ లు తీయగా, మొత్తం చెయ్యంతా ముడతలు పడిపోయి కనిపించింది. దీన్ని ఫోటో తీసిన సయ్యద్, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు వేల కొద్దీ లైక్స్ రాగా, కరోనాపై చికిత్సలో తమ ఆరోగ్యాన్ని కూడా పక్కన బెడుతున్న మీ వంటి వైద్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదంటూ కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి ప్రతి ఐదు గంటలకూ ఓ మారు వైద్యులు తమ చేతి తొడుగులను మార్చుకోవాలి. అందుకు దాదాపు 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. తమ వద్ద ఆ మాత్రం సమయం కూడా ఉండటం లేదని, విధుల్లో ఒక్కరమే ఉండాల్సి వస్తుండటమే ఇందుకు కారణమని, డాక్టర్లే వార్డ్ బాయ్, నర్స్ బాధ్యతలు కూడా నెరవేర్చాల్సి వస్తోందని, ఒక్కోమారు తన ఫిష్ట్ ముగిసినా వెళ్లే వీలుండదని ఈ సందర్భంగా సయ్యద్ వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్లు ధరించి పని చేస్తుంటే నరకంగా ఉంటుందని, శరీరంలో చెమట పట్టి, దాన్ని తుడుచుకోలేని పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...