Skip to main content

చేతులకు పది గంటలు గ్లౌజ్ లు వేసుకుంటే... డాక్టర్ షేర్ చేసిన పిక్!

 


కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులే ముందు నిలిచారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. నిరంతరం వైద్యులు పడుతున్న శ్రమతోనే రికవరీల సంఖ్య అధికంగా ఉంటూ, మరణాల రేటు కనిష్ఠానికి పడిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిద్రాహారాలు మాని, ఇంటికి దూరమై, ఆసుపత్రుల్లో చికిత్సలను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలను పణంగా కూడా పెడుతున్నారు. ఊపిరాడని విధంగా పీపీఈ కిట్లు ధరించడంతో పాటు, చేతులకు గ్లౌజులు వేసుకుని గంటల తరబడి విధుల్లో నిమగ్నమై ఉన్నారు.


ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్, 10 గంటల పాటు గ్లౌజ్ లను ధరించడం వల్ల తన చేతులు ఇలా మారిపోయాయంటూ షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు, కరోనా రోగులకు చికిత్స చేసే నిమిత్తం గంటల తరబడి చేతులకు తొడుగులు తొడుక్కోవాల్సి వచ్చింది. ఓ వార్డులో నుంచి పది గంటల పాటు అతను బయటకు రాలేక పోయాడు. కనీసం విశ్రాంతికి కూడా సమయం లేకపోగా, గ్లౌజ్ లను మార్చేందుకు కూడా వీల్లేకపోయింది.

ఆపై రౌండ్స్ తరువాత చేతులకు గ్లౌజ్ లు తీయగా, మొత్తం చెయ్యంతా ముడతలు పడిపోయి కనిపించింది. దీన్ని ఫోటో తీసిన సయ్యద్, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు వేల కొద్దీ లైక్స్ రాగా, కరోనాపై చికిత్సలో తమ ఆరోగ్యాన్ని కూడా పక్కన బెడుతున్న మీ వంటి వైద్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదంటూ కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి ప్రతి ఐదు గంటలకూ ఓ మారు వైద్యులు తమ చేతి తొడుగులను మార్చుకోవాలి. అందుకు దాదాపు 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. తమ వద్ద ఆ మాత్రం సమయం కూడా ఉండటం లేదని, విధుల్లో ఒక్కరమే ఉండాల్సి వస్తుండటమే ఇందుకు కారణమని, డాక్టర్లే వార్డ్ బాయ్, నర్స్ బాధ్యతలు కూడా నెరవేర్చాల్సి వస్తోందని, ఒక్కోమారు తన ఫిష్ట్ ముగిసినా వెళ్లే వీలుండదని ఈ సందర్భంగా సయ్యద్ వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్లు ధరించి పని చేస్తుంటే నరకంగా ఉంటుందని, శరీరంలో చెమట పట్టి, దాన్ని తుడుచుకోలేని పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.