Skip to main content

చేతులకు పది గంటలు గ్లౌజ్ లు వేసుకుంటే... డాక్టర్ షేర్ చేసిన పిక్!

 


కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులే ముందు నిలిచారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. నిరంతరం వైద్యులు పడుతున్న శ్రమతోనే రికవరీల సంఖ్య అధికంగా ఉంటూ, మరణాల రేటు కనిష్ఠానికి పడిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిద్రాహారాలు మాని, ఇంటికి దూరమై, ఆసుపత్రుల్లో చికిత్సలను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలను పణంగా కూడా పెడుతున్నారు. ఊపిరాడని విధంగా పీపీఈ కిట్లు ధరించడంతో పాటు, చేతులకు గ్లౌజులు వేసుకుని గంటల తరబడి విధుల్లో నిమగ్నమై ఉన్నారు.


ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్, 10 గంటల పాటు గ్లౌజ్ లను ధరించడం వల్ల తన చేతులు ఇలా మారిపోయాయంటూ షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు, కరోనా రోగులకు చికిత్స చేసే నిమిత్తం గంటల తరబడి చేతులకు తొడుగులు తొడుక్కోవాల్సి వచ్చింది. ఓ వార్డులో నుంచి పది గంటల పాటు అతను బయటకు రాలేక పోయాడు. కనీసం విశ్రాంతికి కూడా సమయం లేకపోగా, గ్లౌజ్ లను మార్చేందుకు కూడా వీల్లేకపోయింది.

ఆపై రౌండ్స్ తరువాత చేతులకు గ్లౌజ్ లు తీయగా, మొత్తం చెయ్యంతా ముడతలు పడిపోయి కనిపించింది. దీన్ని ఫోటో తీసిన సయ్యద్, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు వేల కొద్దీ లైక్స్ రాగా, కరోనాపై చికిత్సలో తమ ఆరోగ్యాన్ని కూడా పక్కన బెడుతున్న మీ వంటి వైద్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదంటూ కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి ప్రతి ఐదు గంటలకూ ఓ మారు వైద్యులు తమ చేతి తొడుగులను మార్చుకోవాలి. అందుకు దాదాపు 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. తమ వద్ద ఆ మాత్రం సమయం కూడా ఉండటం లేదని, విధుల్లో ఒక్కరమే ఉండాల్సి వస్తుండటమే ఇందుకు కారణమని, డాక్టర్లే వార్డ్ బాయ్, నర్స్ బాధ్యతలు కూడా నెరవేర్చాల్సి వస్తోందని, ఒక్కోమారు తన ఫిష్ట్ ముగిసినా వెళ్లే వీలుండదని ఈ సందర్భంగా సయ్యద్ వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్లు ధరించి పని చేస్తుంటే నరకంగా ఉంటుందని, శరీరంలో చెమట పట్టి, దాన్ని తుడుచుకోలేని పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...