Skip to main content

టాలీవుడ్ లో దుమారం..! సినిమా షూటింగులపై వాస్తవాలు దాచారా…? |

 


సినీరంగంలో చాలా మందికి కరోనా సోకింది. నిజమే..!
షూటింగులు ఆగిపోయాయి. నిజమే…!
షూటింగులుకి అనుమతులు ఇవ్వాలంటూ చిరు, నాగార్జున కేసీఆర్ తో భేటీ వేశారు. నిజమే…!!
ఇన్ని నిజాలు వెనుక మరో కఠోర నిజమూ ఉంది. షూటింగుల అనుమతుల్లో మతలబు ఉంది.., సీనియర్లు దాచిపెట్టిన తతంగమూ ఉంది. తెరబయట చర్చల్లో బయటపడని రహస్యము ఉంది.. అది ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నోటా, ఈ నోటా పాకుతుంది. కానీ ఎవ్వరూ ఏమి అనలేక, చేయలేక గమ్మునున్నారు. ఇంతకూ ఏమిటా నిజం అంటే…!!


కేసీఆర్ పెట్టిన మెలిక ఏమిటి…?

చిరు, నాగార్జున బృందం కేసీఆర్ తో భేటీ అయిన వార్త పాత అంశమే. కానీ దీనిలో దాచిన పాయింట్లే ఇప్పుడు కొత్తవి. అవే ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. “కేసీఆర్ తో భేటీ సందర్భముగా షూటింగులకు అనుమతులు ఇవ్వాలి అంటూ నటులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. కాస్త ఆలోచించిన కేసీఆర్ 60 ఏళ్ళ పైబడిన వారు తప్ప… ఈ వయసు లోపు ఉన్న వాళ్లకు అనుమతులు ఇస్తాము అన్నారు. కానీ ఈ మెలిక మనోళ్లకు నచ్చలేదు. ఎందుకా అని ఆరాతీస్తే … భేటీకి వెళ్లిన చిరంజీవి వయసు 65 .., నాగార్జున వయసు 61 .., ఇలా పెద్దోళ్ళు వెళ్లారు. వీరికి కేసీఆర్ పెట్టిన మెలిక నచ్చలేదు. అందుకే వద్దులే, షూటింగులతో మాకే రిస్కు… మొత్తం తగ్గిన తర్వాత చూద్దాం లే అంటూ వచ్చేసారు.


70 శాతం షూటింగులు జరిగే అవకాశం ఉంది…!!

నిజానికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధమిక అనుమతుల మేరకు సినీ పరిశ్రమలో 70 శాతం షూటింగులు జరుపుకునే వీలుంది. నడి వయస్కులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా… యువ హీరోల షూటింగులకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. పైగా హీరోలు, ప్రొడ్యూసర్లు తప్ప సినీ పరిశ్రమలో మిగిలిన అందరూ 50 ఏళ్ళ లోపు వారే అధికంగా ఉంటారు. మొఖ్యంగా షూటింగ్ లో కీలక పాత్ర పోషించే అసిస్టెంట్లు సగటు వయసు 40 .., టెక్నిషియన్ల వయసు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. సో… ఎలా చూసినా కేసీఆర్ ఇచ్చిన అనుమతులు వాడుకుంటే పరిశ్రమలో కొంత మేరకు షూటింగులు జరిగేవేమో…! కానీ వాటిని మన స్టార్లు సున్నితంగా తిరస్కరించారు. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో భిన్న స్వరాలొస్తున్నాయి. “సరేలే ఇదీ మంచికే షూటింగులకు వెళ్తే కరోనా విపరీతంగా సోకేది.., మనోళ్లు మంచి పనే చేశారు” అంటూ కొందరు మంచి చెప్పుకుంటుంటే…, వయసు మళ్ళిన హీరోలు వెళ్లి కుర్ర హీరోలు, ఇతర టెక్నిషియన్లకు దెబ్బ కొట్టారంటూ ఇంకొందరు చెప్పుకుంటున్నారు. బయటకు చెప్పకపోయినా సినీ పరిశ్రమలో అంతర్గతంగా ఈ చర్చ ధారాళంగా ఉంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.