Skip to main content

టాలీవుడ్ లో దుమారం..! సినిమా షూటింగులపై వాస్తవాలు దాచారా…? |

 


సినీరంగంలో చాలా మందికి కరోనా సోకింది. నిజమే..!
షూటింగులు ఆగిపోయాయి. నిజమే…!
షూటింగులుకి అనుమతులు ఇవ్వాలంటూ చిరు, నాగార్జున కేసీఆర్ తో భేటీ వేశారు. నిజమే…!!
ఇన్ని నిజాలు వెనుక మరో కఠోర నిజమూ ఉంది. షూటింగుల అనుమతుల్లో మతలబు ఉంది.., సీనియర్లు దాచిపెట్టిన తతంగమూ ఉంది. తెరబయట చర్చల్లో బయటపడని రహస్యము ఉంది.. అది ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నోటా, ఈ నోటా పాకుతుంది. కానీ ఎవ్వరూ ఏమి అనలేక, చేయలేక గమ్మునున్నారు. ఇంతకూ ఏమిటా నిజం అంటే…!!


కేసీఆర్ పెట్టిన మెలిక ఏమిటి…?

చిరు, నాగార్జున బృందం కేసీఆర్ తో భేటీ అయిన వార్త పాత అంశమే. కానీ దీనిలో దాచిన పాయింట్లే ఇప్పుడు కొత్తవి. అవే ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. “కేసీఆర్ తో భేటీ సందర్భముగా షూటింగులకు అనుమతులు ఇవ్వాలి అంటూ నటులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. కాస్త ఆలోచించిన కేసీఆర్ 60 ఏళ్ళ పైబడిన వారు తప్ప… ఈ వయసు లోపు ఉన్న వాళ్లకు అనుమతులు ఇస్తాము అన్నారు. కానీ ఈ మెలిక మనోళ్లకు నచ్చలేదు. ఎందుకా అని ఆరాతీస్తే … భేటీకి వెళ్లిన చిరంజీవి వయసు 65 .., నాగార్జున వయసు 61 .., ఇలా పెద్దోళ్ళు వెళ్లారు. వీరికి కేసీఆర్ పెట్టిన మెలిక నచ్చలేదు. అందుకే వద్దులే, షూటింగులతో మాకే రిస్కు… మొత్తం తగ్గిన తర్వాత చూద్దాం లే అంటూ వచ్చేసారు.


70 శాతం షూటింగులు జరిగే అవకాశం ఉంది…!!

నిజానికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధమిక అనుమతుల మేరకు సినీ పరిశ్రమలో 70 శాతం షూటింగులు జరుపుకునే వీలుంది. నడి వయస్కులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా… యువ హీరోల షూటింగులకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. పైగా హీరోలు, ప్రొడ్యూసర్లు తప్ప సినీ పరిశ్రమలో మిగిలిన అందరూ 50 ఏళ్ళ లోపు వారే అధికంగా ఉంటారు. మొఖ్యంగా షూటింగ్ లో కీలక పాత్ర పోషించే అసిస్టెంట్లు సగటు వయసు 40 .., టెక్నిషియన్ల వయసు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. సో… ఎలా చూసినా కేసీఆర్ ఇచ్చిన అనుమతులు వాడుకుంటే పరిశ్రమలో కొంత మేరకు షూటింగులు జరిగేవేమో…! కానీ వాటిని మన స్టార్లు సున్నితంగా తిరస్కరించారు. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో భిన్న స్వరాలొస్తున్నాయి. “సరేలే ఇదీ మంచికే షూటింగులకు వెళ్తే కరోనా విపరీతంగా సోకేది.., మనోళ్లు మంచి పనే చేశారు” అంటూ కొందరు మంచి చెప్పుకుంటుంటే…, వయసు మళ్ళిన హీరోలు వెళ్లి కుర్ర హీరోలు, ఇతర టెక్నిషియన్లకు దెబ్బ కొట్టారంటూ ఇంకొందరు చెప్పుకుంటున్నారు. బయటకు చెప్పకపోయినా సినీ పరిశ్రమలో అంతర్గతంగా ఈ చర్చ ధారాళంగా ఉంది.

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.