Skip to main content

టాలీవుడ్ లో దుమారం..! సినిమా షూటింగులపై వాస్తవాలు దాచారా…? |

 


సినీరంగంలో చాలా మందికి కరోనా సోకింది. నిజమే..!
షూటింగులు ఆగిపోయాయి. నిజమే…!
షూటింగులుకి అనుమతులు ఇవ్వాలంటూ చిరు, నాగార్జున కేసీఆర్ తో భేటీ వేశారు. నిజమే…!!
ఇన్ని నిజాలు వెనుక మరో కఠోర నిజమూ ఉంది. షూటింగుల అనుమతుల్లో మతలబు ఉంది.., సీనియర్లు దాచిపెట్టిన తతంగమూ ఉంది. తెరబయట చర్చల్లో బయటపడని రహస్యము ఉంది.. అది ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నోటా, ఈ నోటా పాకుతుంది. కానీ ఎవ్వరూ ఏమి అనలేక, చేయలేక గమ్మునున్నారు. ఇంతకూ ఏమిటా నిజం అంటే…!!


కేసీఆర్ పెట్టిన మెలిక ఏమిటి…?

చిరు, నాగార్జున బృందం కేసీఆర్ తో భేటీ అయిన వార్త పాత అంశమే. కానీ దీనిలో దాచిన పాయింట్లే ఇప్పుడు కొత్తవి. అవే ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. “కేసీఆర్ తో భేటీ సందర్భముగా షూటింగులకు అనుమతులు ఇవ్వాలి అంటూ నటులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. కాస్త ఆలోచించిన కేసీఆర్ 60 ఏళ్ళ పైబడిన వారు తప్ప… ఈ వయసు లోపు ఉన్న వాళ్లకు అనుమతులు ఇస్తాము అన్నారు. కానీ ఈ మెలిక మనోళ్లకు నచ్చలేదు. ఎందుకా అని ఆరాతీస్తే … భేటీకి వెళ్లిన చిరంజీవి వయసు 65 .., నాగార్జున వయసు 61 .., ఇలా పెద్దోళ్ళు వెళ్లారు. వీరికి కేసీఆర్ పెట్టిన మెలిక నచ్చలేదు. అందుకే వద్దులే, షూటింగులతో మాకే రిస్కు… మొత్తం తగ్గిన తర్వాత చూద్దాం లే అంటూ వచ్చేసారు.


70 శాతం షూటింగులు జరిగే అవకాశం ఉంది…!!

నిజానికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధమిక అనుమతుల మేరకు సినీ పరిశ్రమలో 70 శాతం షూటింగులు జరుపుకునే వీలుంది. నడి వయస్కులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా… యువ హీరోల షూటింగులకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. పైగా హీరోలు, ప్రొడ్యూసర్లు తప్ప సినీ పరిశ్రమలో మిగిలిన అందరూ 50 ఏళ్ళ లోపు వారే అధికంగా ఉంటారు. మొఖ్యంగా షూటింగ్ లో కీలక పాత్ర పోషించే అసిస్టెంట్లు సగటు వయసు 40 .., టెక్నిషియన్ల వయసు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. సో… ఎలా చూసినా కేసీఆర్ ఇచ్చిన అనుమతులు వాడుకుంటే పరిశ్రమలో కొంత మేరకు షూటింగులు జరిగేవేమో…! కానీ వాటిని మన స్టార్లు సున్నితంగా తిరస్కరించారు. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో భిన్న స్వరాలొస్తున్నాయి. “సరేలే ఇదీ మంచికే షూటింగులకు వెళ్తే కరోనా విపరీతంగా సోకేది.., మనోళ్లు మంచి పనే చేశారు” అంటూ కొందరు మంచి చెప్పుకుంటుంటే…, వయసు మళ్ళిన హీరోలు వెళ్లి కుర్ర హీరోలు, ఇతర టెక్నిషియన్లకు దెబ్బ కొట్టారంటూ ఇంకొందరు చెప్పుకుంటున్నారు. బయటకు చెప్పకపోయినా సినీ పరిశ్రమలో అంతర్గతంగా ఈ చర్చ ధారాళంగా ఉంది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...