Skip to main content

ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకున్నా : దిల్ రాజు


ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకున్నా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారగా, వారి దీనగాథ తెలుసుకుని చలించిపోయిన దిల్ రాజు ఆ ముగ్గురిని తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. ‘ఈ ముగ్గురు చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నా.. ఇకపై వీరి ముగ్గురి సంరక్షణ బాధ్యతలను నేనే చూసుకుంటా’ అని దిల్ రాజు తెలిపారు

ఆత్మకూరు గ్రామానికి చెందిన గట్టు సత్తయ్య, అనురాధ దంపతులకు మనోహర్, లాస్య, యశ్వంత్ అనే పిల్లలున్నారు. మొదట గట్టు సత్తయ్య అనారోగ్యంతో చనిపోగా, ఆ తర్వాత ఆయన భార్య అనురాధ కూడా కన్నుమూశారు. దాంతో మనోహర్, లాస్య, యశ్వంత్ దిక్కలేనివారయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా తెలుసుకున్న దిల్ రాజు కదిలిపోయారు. వెంటనే వారి బాధ్యతలు తాను స్వీకరిస్తానని ముందుకొచ్చారు.

తమ కుటుంబం 2018లో ‘మా పల్లె చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించిందని, ఇప్పుడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ముగ్గురు చిన్నారుల బాగోగులు చూసుకుంటామని దిల్ రాజు తెలియచేసారు . ఇక నుంచి మనోహర్, లాస్య, యశ్వంత్ తమ కుటుంబంలో సభ్యులేనని ఆయన స్పష్టం చేశారు, ఆ ముగ్గురు తోబుట్టువుల విషయాన్ని తన దృష్టికి తెచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని దిల్ రాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...