Skip to main content

ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకున్నా : దిల్ రాజు


ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకున్నా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారగా, వారి దీనగాథ తెలుసుకుని చలించిపోయిన దిల్ రాజు ఆ ముగ్గురిని తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. ‘ఈ ముగ్గురు చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నా.. ఇకపై వీరి ముగ్గురి సంరక్షణ బాధ్యతలను నేనే చూసుకుంటా’ అని దిల్ రాజు తెలిపారు

ఆత్మకూరు గ్రామానికి చెందిన గట్టు సత్తయ్య, అనురాధ దంపతులకు మనోహర్, లాస్య, యశ్వంత్ అనే పిల్లలున్నారు. మొదట గట్టు సత్తయ్య అనారోగ్యంతో చనిపోగా, ఆ తర్వాత ఆయన భార్య అనురాధ కూడా కన్నుమూశారు. దాంతో మనోహర్, లాస్య, యశ్వంత్ దిక్కలేనివారయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా తెలుసుకున్న దిల్ రాజు కదిలిపోయారు. వెంటనే వారి బాధ్యతలు తాను స్వీకరిస్తానని ముందుకొచ్చారు.

తమ కుటుంబం 2018లో ‘మా పల్లె చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించిందని, ఇప్పుడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ముగ్గురు చిన్నారుల బాగోగులు చూసుకుంటామని దిల్ రాజు తెలియచేసారు . ఇక నుంచి మనోహర్, లాస్య, యశ్వంత్ తమ కుటుంబంలో సభ్యులేనని ఆయన స్పష్టం చేశారు, ఆ ముగ్గురు తోబుట్టువుల విషయాన్ని తన దృష్టికి తెచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని దిల్ రాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.