Skip to main content

అయోధ్య రామమందిర నిర్మాణంలో తిరుగులేని నాణ్యత.. వెయ్యేళ్లపాటు పదిలంగా ఉండేలా నిర్మాణం!



అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరాన్ని అత్యున్నత న్యాణ్యతతో ఎటువంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా తట్టుకుని వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించనున్నారు. ఎంతలా అంటే.. 10 తీవ్రతతో భూకంపం సంభవించినా ఏమీ కానంతగా ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోమ్‌పుర డిజైన్ చేశారు.

రెండెకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మించి, మిగతా స్థలంలో అనేక రకాల చెట్లు పెంచుతారు. అలాగే, మ్యూజియంతోపాటు ఆలయానికి అనుబంధ భవనాలను నిర్మిస్తారు. ఆలయ నిర్మాణం బలంగా ఉండేందుకు 200 అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని పరీక్షించారు. వెయ్యేళ్ల వరకు ఆలయ రూపంలో కానీ, ఆకృతిలో కానీ ఎలాంటి మార్పులు ఉండనంతంగా దీనిని నిర్మిస్తున్నట్టు నిర్మాణ పనుల సూపర్ వైజర్ అన్నుభాయ్ సోమ్‌పుర తెలిపారు. అంతేకాదు, ఒకేసారి 10 వేల మందికిపైగా భక్తులు సందర్శించుకునేలా దీనిని డిజైన్ చేసినట్టు వివరించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.