టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆదివారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు మొక్కలు నాటారు. అయితే ఆయన మొక్కలు నాటుతున్న సందర్భంలో మాస్కును ధరించలేదు. దాంతో బహిరంగ ప్రదేశంలో మాస్క్ లేకుండా తిరిగినందుకు ఆయనకు వెయ్యిరూపాయలు జరిమానా విధించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రిన్స్ కు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment