టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆదివారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు మొక్కలు నాటారు. అయితే ఆయన మొక్కలు నాటుతున్న సందర్భంలో మాస్కును ధరించలేదు. దాంతో బహిరంగ ప్రదేశంలో మాస్క్ లేకుండా తిరిగినందుకు ఆయనకు వెయ్యిరూపాయలు జరిమానా విధించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రిన్స్ కు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

Comments
Post a Comment