Skip to main content

ముంబైలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం!


ఎడతెరిపిలేని వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇంతగా వర్షం కురవడం ఇదే మొదటిసారి కాగా, చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల అపార్టుమెంట్లలోని సెల్లార్లలోకి నీరు ప్రవేశించి, వేలాది వాహనాలు పనికిరాకుండా పోయాయి. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబైతో పాటు థానె, పుణె తదితర జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది.

మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి సాయపడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, శాంతాక్రజ్ లో ఓ ఇల్లు కూలిపోగా ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. వరద నీటిలో కొట్టుకుపోతూ, కనిపించిన కరెంట్ స్తంభాన్ని పట్టుకున్న ఓ బాలుడు విద్యుత్ షాక్ తో మృతిచెందాడు.

సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఓ చేపల బోటు మునిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ముంబై నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ప్రజా రవాణాను మొత్తం నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు ప్రకటించారు. కాగా, మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాలను కూడా వర్షం వణికిస్తోంది.  

Comments

Popular posts from this blog

మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందించాలని పవన్ నిర్ణయం

  తమ ఆరాధ్య హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతంతో మృతి చెందడం తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ విషాదం పవన్ ను కదిలించివేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటూ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు, ప్రమాదం వివరాలు తెలుసుకున్న ఆయన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. దూరమైన బిడ్డలను తీసుకురాలేను కానీ, బిడ్డలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు నేను బిడ్డనై నిలుస్తానంటూ వ్యాఖ్యానించారు.

సుశాంత్ సింగ్ పై అభిమానం... 'సడక్-2'పై ఆగ్రహమైంది!

  సంజయ్ దత్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా, ఆలియా తండ్రి మహేశ్ భట్ నిర్మించిన 'సడక్-2' ట్రయిలర్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డులను క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ట్రయిలర్ విడుదల కాగానే, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై ఉన్న అభిమానం, ఈ ట్రయిల్ పట్ల శాపమైంది.  బాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నారన్న ఆరోపణలు, గతంలో మహేశ్ భట్, సుశాంత్ కు అన్యాయం చేశారన్న పుకార్ల నేపథ్యంలో, ఈ వీడియోకు అత్యధిక డిస్ లైక్స్ రావడం గమనార్హం. ఇక ఈ సినిమా ట్రయిలర్ కింద సుశాంత్ కు న్యాయం జరగాల్సిందేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రయిలర్ కు ఏకంగా 30 లక్షలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక డిస్ లైక్ లు వచ్చిన ట్రయిలర్ గా ఇది నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.