Skip to main content

నేను కన్నీళ్లు పెట్టుకున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నా: పరుచూరి గోపాలకృష్ణ

 
 

హైదరాబాద్ లో నిర్వహించిన 'మా' సభ్యుల సమావేశం నుంచి సుప్రసిద్ధ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకుని బయటికి వచ్చారంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. నటుడు పృథ్వీ చెప్పడంతో మీడియాలో ఈ విషయం ప్రముఖంగా ప్రసారమైంది. అయితే దీనిపై పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా వివరణ ఇచ్చారు. 'మా' సమావేశం నుంచి తాను కంటతడి పెట్టుకుని బయటికి వచ్చినట్టు కొన్ని మీడియా చానల్స్ లో వార్తలు వస్తున్నాయని, వాటిని తాను ఖండిస్తున్నానని అన్నారు. తాను 'మా' సభ్యుల సమావేశానికి హాజరైంది నిజమేనని, అయితే కొందరి సభ్యుల తీరు తనకు నచ్చలేదని, అందుకే బయటికి వచ్చేశాను తప్ప, కంటతడి పెట్టుకున్నాననడంలో వాస్తవంలేదని స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.