Skip to main content

2003లో తమిళనాడులో 1.70 లక్షల మందిని తీసేసిన జయలలిత... నేడు కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా చర్చ!

అది 2003. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా, వారిపై కఠిన వైఖరిని అవలంబిస్తూ, మొత్తం 1.70 లక్షల మందిని తొలగించాలని జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇక, తాజాగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగగా, వారెవరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదని కేసీఆర్ స్వయంగా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. వాస్తవానికి టీఎస్ ఆర్టీసీలో 49,860 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 1,200 మంది వరకూ మాత్రమే విధుల్లో ఉన్నట్టు వెల్లడించిన కేసీఆర్, సమ్మెలో ఉన్న వారిని తిరిగి రానివ్వబోమని స్పష్టం చేశారు. దీని ద్వారా మిగిలిన సుమారు 48,660 మందిని తొలగించినట్టేనని కేసీఆర్ చెప్పకనే చెప్పినట్టు అయింది. ఇక అదే జరిగితే సంచలనమేనని నిపుణులు అంటున్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.