Skip to main content

జగన్ సర్కార్‌కు హెచ్చరిక.. సేవ్ ఆళ్లగడ్డ అంటున్న అఖిల!



జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం యాదవాడలో జరుగుతున్న యురేనియం ఖనిజం అన్వేషణ పనులను మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిల ప్రియ అడ్డుకున్నారు. ఆమె ఘటనాస్థలికి రావడంతో వెంటనే కాంట్రాక్ట్ సిబ్బంది పనులను ఆపేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన అఖిల.. ఏపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా యాదవాడలో యురేనియం ఖనిజాన్వేషణ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. యురేనియం కోసం సర్వే చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాగా.. వారం రోజులుగా యురేనియం ఖనిజం అన్వేషణ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని అఖిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేటి నుంచి క్యాంపెయిన్!
"యురేనియం వల్ల కడప జిల్లాలో వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు.. నీరంతా కలుషితమైంది. ‘సేవ్ నల్లమల... సేవ్ ఆళ్లగడ్డ’ క్యాంపెయిన్ నేటి నుంచే మొదలైంది. గతంలో వైసీపీ నాయకులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకించారు. ఇప్పుడు మౌనంగా ఉండడం శోచనీయం.. అసలెందుకు మౌనంగా ఉంటున్నారు..?. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యురేనియం ఖనిజాన్వేషణ పనులను ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలి. లేకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాను " అని ప్రభుత్వాన్ని అఖిల హెచ్చరించారు. అఖిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.