Skip to main content

చర్మానికీ రానుందో బ్యాంకు!


ఆలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ లభించడంతోపాటు.. శరీరంలోకి ఎక్కించిన ఫ్లూయిడ్స్‌ బయటకు రాకుండా ఆపే వీలుంటుంది. ఫలితంగా, బాధితులు త్వరగా కోలుకుంటారు. ప్రాణాపాయం నుంచి బయటపడతారు. కానీ, 60 శాతానికిపైగా కాలినగాయాలైనవారి శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మాన్ని సేకరించడం కుదరదు. అలాంటివారికి స్కిన్‌ బ్యాంక్‌ నుంచి చర్మాన్ని సేకరించి తాత్కాలికంగా గ్రాఫ్టింగ్‌ చేస్తుంటారు. దీని వల్ల ఇన్ఫెక్షన్‌ను నియంత్రించొచ్చు. ఇలా అతికించిన చర్మం మూడు వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఊడిపోతుంది. ఈ మూడు వారాల్లో గాయాలు తగ్గేందుకు వైద్యులు చేసే చికిత్సలు సత్ఫలితాలను ఇస్తాయి.

పేదలకు మేలు..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక శాతం స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేసేందుకు రూ. 40 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఖర్చువుతుంది. అదే 35-40ు కాలిన గాయాలైన వారికి రూ. 12 నుంచి 14 లక్షల వరకు ఖర్చువుతుంది. 60ు కంటే ఎక్కువ కాలిన గాయాలైనవారైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత చికిత్స ద్వారా ఇప్పటికే వేల మంది ప్రాణాలను కాపాడారు. స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ అందుబాటులోకి వస్తుందని.. ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు తెలుపుతున్నారు. స్కిన్‌బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వారు గతంలోనే ప్రభుత్వానికి పంపారు. అందుకు దాదాపు రూ. కోటి ఖర్చవుతుందని అంచనా.

ఈ నేపథ్యంలోనే.. రోటరీ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థ ఉస్మానియాలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఓపీ భవనంలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో స్కిన్‌ బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన మ్యాప్‌ను సిద్ధం చేసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధికారులు తెలిపారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...