Skip to main content

చర్మానికీ రానుందో బ్యాంకు!


ఆలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ లభించడంతోపాటు.. శరీరంలోకి ఎక్కించిన ఫ్లూయిడ్స్‌ బయటకు రాకుండా ఆపే వీలుంటుంది. ఫలితంగా, బాధితులు త్వరగా కోలుకుంటారు. ప్రాణాపాయం నుంచి బయటపడతారు. కానీ, 60 శాతానికిపైగా కాలినగాయాలైనవారి శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మాన్ని సేకరించడం కుదరదు. అలాంటివారికి స్కిన్‌ బ్యాంక్‌ నుంచి చర్మాన్ని సేకరించి తాత్కాలికంగా గ్రాఫ్టింగ్‌ చేస్తుంటారు. దీని వల్ల ఇన్ఫెక్షన్‌ను నియంత్రించొచ్చు. ఇలా అతికించిన చర్మం మూడు వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఊడిపోతుంది. ఈ మూడు వారాల్లో గాయాలు తగ్గేందుకు వైద్యులు చేసే చికిత్సలు సత్ఫలితాలను ఇస్తాయి.

పేదలకు మేలు..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక శాతం స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేసేందుకు రూ. 40 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఖర్చువుతుంది. అదే 35-40ు కాలిన గాయాలైన వారికి రూ. 12 నుంచి 14 లక్షల వరకు ఖర్చువుతుంది. 60ు కంటే ఎక్కువ కాలిన గాయాలైనవారైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత చికిత్స ద్వారా ఇప్పటికే వేల మంది ప్రాణాలను కాపాడారు. స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ అందుబాటులోకి వస్తుందని.. ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు తెలుపుతున్నారు. స్కిన్‌బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వారు గతంలోనే ప్రభుత్వానికి పంపారు. అందుకు దాదాపు రూ. కోటి ఖర్చవుతుందని అంచనా.

ఈ నేపథ్యంలోనే.. రోటరీ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థ ఉస్మానియాలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఓపీ భవనంలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో స్కిన్‌ బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన మ్యాప్‌ను సిద్ధం చేసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధికారులు తెలిపారు. 

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.