Skip to main content

చర్మానికీ రానుందో బ్యాంకు!


ఆలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ లభించడంతోపాటు.. శరీరంలోకి ఎక్కించిన ఫ్లూయిడ్స్‌ బయటకు రాకుండా ఆపే వీలుంటుంది. ఫలితంగా, బాధితులు త్వరగా కోలుకుంటారు. ప్రాణాపాయం నుంచి బయటపడతారు. కానీ, 60 శాతానికిపైగా కాలినగాయాలైనవారి శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మాన్ని సేకరించడం కుదరదు. అలాంటివారికి స్కిన్‌ బ్యాంక్‌ నుంచి చర్మాన్ని సేకరించి తాత్కాలికంగా గ్రాఫ్టింగ్‌ చేస్తుంటారు. దీని వల్ల ఇన్ఫెక్షన్‌ను నియంత్రించొచ్చు. ఇలా అతికించిన చర్మం మూడు వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఊడిపోతుంది. ఈ మూడు వారాల్లో గాయాలు తగ్గేందుకు వైద్యులు చేసే చికిత్సలు సత్ఫలితాలను ఇస్తాయి.

పేదలకు మేలు..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక శాతం స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేసేందుకు రూ. 40 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఖర్చువుతుంది. అదే 35-40ు కాలిన గాయాలైన వారికి రూ. 12 నుంచి 14 లక్షల వరకు ఖర్చువుతుంది. 60ు కంటే ఎక్కువ కాలిన గాయాలైనవారైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత చికిత్స ద్వారా ఇప్పటికే వేల మంది ప్రాణాలను కాపాడారు. స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ అందుబాటులోకి వస్తుందని.. ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు తెలుపుతున్నారు. స్కిన్‌బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వారు గతంలోనే ప్రభుత్వానికి పంపారు. అందుకు దాదాపు రూ. కోటి ఖర్చవుతుందని అంచనా.

ఈ నేపథ్యంలోనే.. రోటరీ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థ ఉస్మానియాలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఓపీ భవనంలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో స్కిన్‌ బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన మ్యాప్‌ను సిద్ధం చేసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధికారులు తెలిపారు. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...