Skip to main content

చర్మానికీ రానుందో బ్యాంకు!


ఆలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ లభించడంతోపాటు.. శరీరంలోకి ఎక్కించిన ఫ్లూయిడ్స్‌ బయటకు రాకుండా ఆపే వీలుంటుంది. ఫలితంగా, బాధితులు త్వరగా కోలుకుంటారు. ప్రాణాపాయం నుంచి బయటపడతారు. కానీ, 60 శాతానికిపైగా కాలినగాయాలైనవారి శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మాన్ని సేకరించడం కుదరదు. అలాంటివారికి స్కిన్‌ బ్యాంక్‌ నుంచి చర్మాన్ని సేకరించి తాత్కాలికంగా గ్రాఫ్టింగ్‌ చేస్తుంటారు. దీని వల్ల ఇన్ఫెక్షన్‌ను నియంత్రించొచ్చు. ఇలా అతికించిన చర్మం మూడు వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఊడిపోతుంది. ఈ మూడు వారాల్లో గాయాలు తగ్గేందుకు వైద్యులు చేసే చికిత్సలు సత్ఫలితాలను ఇస్తాయి.

పేదలకు మేలు..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక శాతం స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేసేందుకు రూ. 40 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఖర్చువుతుంది. అదే 35-40ు కాలిన గాయాలైన వారికి రూ. 12 నుంచి 14 లక్షల వరకు ఖర్చువుతుంది. 60ు కంటే ఎక్కువ కాలిన గాయాలైనవారైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత చికిత్స ద్వారా ఇప్పటికే వేల మంది ప్రాణాలను కాపాడారు. స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ అందుబాటులోకి వస్తుందని.. ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు తెలుపుతున్నారు. స్కిన్‌బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వారు గతంలోనే ప్రభుత్వానికి పంపారు. అందుకు దాదాపు రూ. కోటి ఖర్చవుతుందని అంచనా.

ఈ నేపథ్యంలోనే.. రోటరీ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థ ఉస్మానియాలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఓపీ భవనంలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో స్కిన్‌ బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన మ్యాప్‌ను సిద్ధం చేసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధికారులు తెలిపారు. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...