Skip to main content

చర్మం కింది పొరకు టీకా... భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు కేంద్రం మరో కీలక అనుమతి!

 

కరోనా మహమ్మారిని అడ్డుకునేలా భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్ ను చర్మం కింది పొరలోకి ఇంజక్ట్ చేయడం ద్వారా ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రొటోకాల్ నిబంధనలను సడలించాల్సివుంటుంది. ఇందుకోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని నుంచి తుది అనుమతుల కోసం సంస్థ చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ తో సంబంధం లేకుండా విడిగా ఈ విధానంలో టీకా పనితీరును పరిశీలించాలన్నది సంస్థ అభిమతం.


ఏదైనా టీకాను పలు మార్గాల ద్వారా శరీరంలోకి పంపుతారు. ఎక్కువగా భుజాలు, పిరుదు కండరాల ద్వారా వేసే టీకాలను ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. మరో విధానం పేరే ఇంట్రాడెర్మల్ రూట్. దీనిలో భాగంగా చర్మం కింది పొరకు టీకాను ఇస్తారు. ఈ విధానంలో టీకాను ఇస్తే, చాలా స్వల్ప మోతాదు సరిపోతుంది. ఫలితంగా మరింత మందికి టీకాను ఇవ్వడంతో పాటు, ధర కూడా తగ్గుతుంది. ఉదాహరణకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ను తీసుకుంటే, కండరాలకు ఇచ్చే వ్యాక్సిన్ తో పోలిస్తే, చర్మం ద్వారా ఇస్తే, 80 శాతం తక్కువ డోస్ సరిపోతుంది. దీనివల్ల ఒక ఇంజక్షన్ డోస్, నలుగురి నుంచి ఐదుగురికి ఇవ్వచ్చు. తద్వారా దాని రేటు కూడా 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుంది.

కాగా, చర్మం ద్వారా టీకాను వేసేందుకు రెండు నిబంధనలను విధించినట్టు తెలుస్తోంది. పరీక్షల్లో పాల్గొన్న వారిని ఆరు నెలల పాటు పరిశీలనలో ఉంచాలని, వారిలో యాంటీ బాడీల పెరుగుదలను, పనితీరును పరిశీలించాలని, ప్రస్తుతం ట్రయల్స్ జరుపుతున్న చోట కాకుండా వేరే ప్రాంతాలను ఎంచుకోవాలని, ట్రయల్స్ అధ్యయన ఫలితాలను విడిగా సమర్పించాలని సూచించినట్టు సమాచారం. కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్ ను ఫేస్ 1, 2 ట్రయల్స్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 ఆసుపత్రుల్లో 1,125 మందికి ఇచ్చి పరిశీలిస్తున్నారు. న్యూఢిల్లీ, పట్నాలోని ఎయిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, హైదరాబాద్ లోని నిమ్స్, రోహ్ తక్ లో పీజీఐఎంఎస్ తదితర చోట్ల టెస్టింగ్ జరుగుతోంది.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...