Skip to main content

చర్మం కింది పొరకు టీకా... భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు కేంద్రం మరో కీలక అనుమతి!

 

కరోనా మహమ్మారిని అడ్డుకునేలా భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్ ను చర్మం కింది పొరలోకి ఇంజక్ట్ చేయడం ద్వారా ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రొటోకాల్ నిబంధనలను సడలించాల్సివుంటుంది. ఇందుకోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని నుంచి తుది అనుమతుల కోసం సంస్థ చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ తో సంబంధం లేకుండా విడిగా ఈ విధానంలో టీకా పనితీరును పరిశీలించాలన్నది సంస్థ అభిమతం.


ఏదైనా టీకాను పలు మార్గాల ద్వారా శరీరంలోకి పంపుతారు. ఎక్కువగా భుజాలు, పిరుదు కండరాల ద్వారా వేసే టీకాలను ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. మరో విధానం పేరే ఇంట్రాడెర్మల్ రూట్. దీనిలో భాగంగా చర్మం కింది పొరకు టీకాను ఇస్తారు. ఈ విధానంలో టీకాను ఇస్తే, చాలా స్వల్ప మోతాదు సరిపోతుంది. ఫలితంగా మరింత మందికి టీకాను ఇవ్వడంతో పాటు, ధర కూడా తగ్గుతుంది. ఉదాహరణకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ను తీసుకుంటే, కండరాలకు ఇచ్చే వ్యాక్సిన్ తో పోలిస్తే, చర్మం ద్వారా ఇస్తే, 80 శాతం తక్కువ డోస్ సరిపోతుంది. దీనివల్ల ఒక ఇంజక్షన్ డోస్, నలుగురి నుంచి ఐదుగురికి ఇవ్వచ్చు. తద్వారా దాని రేటు కూడా 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుంది.

కాగా, చర్మం ద్వారా టీకాను వేసేందుకు రెండు నిబంధనలను విధించినట్టు తెలుస్తోంది. పరీక్షల్లో పాల్గొన్న వారిని ఆరు నెలల పాటు పరిశీలనలో ఉంచాలని, వారిలో యాంటీ బాడీల పెరుగుదలను, పనితీరును పరిశీలించాలని, ప్రస్తుతం ట్రయల్స్ జరుపుతున్న చోట కాకుండా వేరే ప్రాంతాలను ఎంచుకోవాలని, ట్రయల్స్ అధ్యయన ఫలితాలను విడిగా సమర్పించాలని సూచించినట్టు సమాచారం. కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్ ను ఫేస్ 1, 2 ట్రయల్స్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 ఆసుపత్రుల్లో 1,125 మందికి ఇచ్చి పరిశీలిస్తున్నారు. న్యూఢిల్లీ, పట్నాలోని ఎయిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, హైదరాబాద్ లోని నిమ్స్, రోహ్ తక్ లో పీజీఐఎంఎస్ తదితర చోట్ల టెస్టింగ్ జరుగుతోంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...