Skip to main content

నిజాయితీగా పన్ను చెల్లించే వారికోసం 'ట్రాన్స్‌పరెంట్' స్కీం.. 'ట్యాక్స్‌పేయర్ చార్టర్'


దేశంలో నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గౌరవించేందుకు, అలాగే ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు(ఆగస్ట్ 13) కొత్త పన్ను పథక ప్లాట్‌ఫాంని ప్రారంభిస్తున్నారు. 'పారదర్శక పన్ను విధానం-నిజాయితీపరులకు గౌరవం' అనే పేరుతో ఏర్పాటయిన ఓ ప్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్నారు. ప్రధాని దీనిని ప్రారంభించడం ద్వారా దేశంలో ప్రత్యక్ష పన్ను సంస్కరణల ప్రయాణంలో మరో అడుగు ముందుకు పడుతుంది. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల గౌరవం కోసం ట్యాక్స్‌పేయర్ చార్టర్‌ను తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ ప్లాట్‌ఫాం రూపుదిద్దుకుంది.


పన్నుచెల్లింపుదారులకు మోడీ థ్యాంక్స్

పన్నుచెల్లింపుదారులకు మోడీ థ్యాంక్స్

నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములు అని, దేశాన్ని కరోనా పీడిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు ఇచ్చిన ఉచిత ఆహారధాన్యం వంటి ప్యాకేజీ పన్ను చెల్లింపుదారుల నిజాయితీతోనే సాధ్యమైందని కూడా ప్రధాని మోడీ ఇదివరకే ప్రశంసించారు. వారికి థ్యాంక్స్ చెప్పారు. ట్యాక్స్‌పేయర్ చార్టర్ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ అసోసియేషన్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్, ప్రముఖ పన్ను చెల్లింపుదారులు, ఆదాయపన్ను శాఖ అధికారులు ఉంటారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరవుతున్నారు.

త్వరితగతిన పొందేలా..

త్వరితగతిన సేవలు పొందేలా..

ట్యాక్స్ పేయర్ చార్టర్ తీసుకురానున్నట్లు కేంద్రం గత బడ్జెట్లోనే ప్రకటించింది. చట్టబద్ధ హోదాను కలిగి ఉండే ఈ ప్లాట్‌ఫాం.. ఆదాయ పన్ను (ఐటీ) విభాగం సేవలను త్వరితగతిన పొందేలా ప్రజలకు సాధికారత కల్పిస్తుంది. పన్నుల చెల్లింపులో పారదర్శకతను పెంపొందించడంతో పాటు నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించేందుకు తీసుకొస్తున్న ఈ ప్లాట్‌ఫాం ప్రత్యక్ష పన్ను సంస్కరణల్ని మరింత ముందుకు నడిపేందుకు దోహదం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల పలు కీలక

ఇటీవల పలు కీలక సంస్కరణలు

పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు తీసుకు వస్తోంది. గత ఏడాది కార్పోరేట్ పన్ను రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెలకొల్పేవారికి 15 శాతానికి కుదించింది. డివిడెండ్ పంపిణీ పన్నును కూడా రద్దు చేసింది. పన్ను రేట్లను తగ్గించడం, ప్రత్యక్ష పన్ను చట్టాల్ని సరళతరం చేయడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని, ఐటీ విభాగ పనితీరుని, పారదర్శకతని పెంపొందించేందుకు CBDT ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ పేర్కొంది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...