Skip to main content

ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం

 
ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం

 ఆర్టీసీ సమ్మె, ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన నివేదికపై హైకోర్టులో శుక్రవారం సుదీర్ఘ వాదనలు సాగాయి. ఆర్టీసీకిబకాయిలన్నీ చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది, జీహెచ్‌ఎంసీ కూడా రూ.360 కోట్లు చెల్లించామంటోంది...ఇందులో వాస్తవమెంత అని హైకోర్టు గత విచారణ సందర్భంగా ఆర్టీసీ ఎండీని నివేదిక కోరింది. హైకోర్టు ఆదేశాలమేరకు పూర్తి వివరాలతో నిన్న అఫిడవిట్‌ సమర్పించిన ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఇవాళ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. సునీల్‌శర్మ ఇచ్చిన నివేదికను పరిశీలించిన హైకోర్టుఅసహనం వ్యక్తం చేసింది.
లెక్కల్లో గందరగోళం..
‘‘కోర్టుకు సమర్పించే నివేదికలు ఇలాగేనా? ఐఏఎస్‌ అధికారులు సమర్పించిన నివేదికలు అస్పష్టంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాచి నివేదికలు ఇచ్చారు. ఐఏఎస్‌ అధికారులు లెక్కలతో గందరగోళం సృష్టిస్తున్నారు. బస్సుల కొనుగోలు రుణాన్ని రాయితీ బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటున్నారు’’ అని హైకోర్టు ప్రశ్నించింది. డీజిల్‌, వేతనాల చెల్లింపునకు రాయితీల బకాయిలు వాడామని ఎండీ వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ భరించాలని చట్టంలో ఎక్కడా లేదని ఆర్టీసీ ఎండీ నివేదికలో పేర్కొన్న అంశంపై కోర్టు స్పందిస్తూ... ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన అవసరమే లేనప్పుడు ఎందుకు చెల్లించారని ప్రశ్నించింది. 2015 నుంచి 2017 వరకు రూ.336కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది.
జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారా?
 2018-19 ఏడాదిలో ఆర్టీసీకి రావాల్సిన నిధుల అంశంపై జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారా? జీహెచ్‌ఎంసీ చెల్లించకుంటే  ప్రభుత్వానికి లేఖ రాశారా అని కోర్టు ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ 2015-16లో రూ.550 కోట్లు లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ 2015-16లో రూ.108 కోట్లు, ఆతర్వాత సంవత్సరంలో రూ.228 కోట్లు ఎలా చెల్లించింది? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నదని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని రవాణాశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘అసెంబ్లీ వేదికగా రవాణా మంత్రి తప్పు ప్రకటన చేస్తారని మేము అనుకోవడంలేదు. అసెంబ్లీలో మంత్రి చెప్పింది నమ్మాలా? మీరు కోర్టుకు చెప్పింది నమ్మలా’’ అని ఆర్టీసీ ఎండీని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆర్టీసీ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రీధరన్‌ వాదనలు వినిపించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...