తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు బ్యాంకుల విలీనం అంశంపై స్పందించారు. విలీనం కారణంగా ఆంధ్రా బ్యాంకు పేరు పోవడం బాధగా ఉందని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారని హరీశ్ తెలిపారు. ఆంధ్రా బ్యాంకు పేరు కొనసాగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం అని స్పష్టం చేశారు. ఎక్కువ ఖాతాలు ఉన్న బ్యాంక్ ఆంధ్రా బ్యాంకు అని, ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉందని తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ఆంధ్రా బ్యాంక్ సెక్రటేరియట్ బ్రాంచ్ ను ప్రారంభించిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Andhra Bank name has to be continued, as we have Andhra Bank customers
ReplyDelete