తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు బ్యాంకుల విలీనం అంశంపై స్పందించారు. విలీనం కారణంగా ఆంధ్రా బ్యాంకు పేరు పోవడం బాధగా ఉందని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారని హరీశ్ తెలిపారు. ఆంధ్రా బ్యాంకు పేరు కొనసాగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం అని స్పష్టం చేశారు. ఎక్కువ ఖాతాలు ఉన్న బ్యాంక్ ఆంధ్రా బ్యాంకు అని, ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉందని తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ఆంధ్రా బ్యాంక్ సెక్రటేరియట్ బ్రాంచ్ ను ప్రారంభించిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Bank name has to be continued, as we have Andhra Bank customers
ReplyDelete