తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు బ్యాంకుల విలీనం అంశంపై స్పందించారు. విలీనం కారణంగా ఆంధ్రా బ్యాంకు పేరు పోవడం బాధగా ఉందని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారని హరీశ్ తెలిపారు. ఆంధ్రా బ్యాంకు పేరు కొనసాగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం అని స్పష్టం చేశారు. ఎక్కువ ఖాతాలు ఉన్న బ్యాంక్ ఆంధ్రా బ్యాంకు అని, ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉందని తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ఆంధ్రా బ్యాంక్ సెక్రటేరియట్ బ్రాంచ్ ను ప్రారంభించిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Andhra Bank name has to be continued, as we have Andhra Bank customers
ReplyDelete