Skip to main content

చూస్తుండగానే దుస్సాహసం... 1000 చదరపు కిలోమీటర్లను ఆక్రమించిన చైనా!

ఓ వైపు చైనా దురాక్రమణలను అడ్డుకునే పనిలో భారత సైన్యం నిరంతరం నిఘా పెట్టి, పోరాడుతూ ఉంటే, ఇప్పటికే ఎల్ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లో సుమారు 1000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించేసినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారంటూ, 'ది హిందూ' వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. ఓ వైపు చర్చలంటూనే, మరోవైపు చైనా పీపుల్స్ ఆర్మీ, చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చేసిందని ఆ అధికారి వెల్లడించారట.


వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి దెప్సాంగ్ ప్రాంతం నుంచి చుశుల్ వరకూ ఈ ఆక్రమణలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా దెప్సాంగ్ మైదానంలోని 10వ నంబర్ పెట్రోలింగ్ పాయింట్ నుంచి 13వ నంబర్ పాయింట్ వరకూ సుమారు 900 చదరపు కిలోమీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిపోయాయని, గాల్వాన్ లోయలో 20 చదరపు కిలోమీటర్లు పాంగ్యాంగ్ సరస్సు వద్ద 65 చదరపు కిలోమీటర్లు, హాట్ స్ప్రింగ్ సమీపంలో 12 చదరపు కిలోమీటర్లు, చుశుల్ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించిందని ఆ అధికారి వెల్లడించినట్టు 'ది హిందూ' పేర్కొంది.

ప్రస్తుతం చైనా మరిన్ని ప్రాంతాలపై కన్నేసిందని వివరించిన ఆ ఆఫీసర్, పాంగ్యాంగ్ సమీపంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య ఉన్న దాదాపు 8 కిలోమీటర్ల భూమిని ఆక్రమించేందుకు చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది.  

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.