Skip to main content

చూస్తుండగానే దుస్సాహసం... 1000 చదరపు కిలోమీటర్లను ఆక్రమించిన చైనా!

ఓ వైపు చైనా దురాక్రమణలను అడ్డుకునే పనిలో భారత సైన్యం నిరంతరం నిఘా పెట్టి, పోరాడుతూ ఉంటే, ఇప్పటికే ఎల్ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లో సుమారు 1000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించేసినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారంటూ, 'ది హిందూ' వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. ఓ వైపు చర్చలంటూనే, మరోవైపు చైనా పీపుల్స్ ఆర్మీ, చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చేసిందని ఆ అధికారి వెల్లడించారట.


వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి దెప్సాంగ్ ప్రాంతం నుంచి చుశుల్ వరకూ ఈ ఆక్రమణలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా దెప్సాంగ్ మైదానంలోని 10వ నంబర్ పెట్రోలింగ్ పాయింట్ నుంచి 13వ నంబర్ పాయింట్ వరకూ సుమారు 900 చదరపు కిలోమీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిపోయాయని, గాల్వాన్ లోయలో 20 చదరపు కిలోమీటర్లు పాంగ్యాంగ్ సరస్సు వద్ద 65 చదరపు కిలోమీటర్లు, హాట్ స్ప్రింగ్ సమీపంలో 12 చదరపు కిలోమీటర్లు, చుశుల్ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించిందని ఆ అధికారి వెల్లడించినట్టు 'ది హిందూ' పేర్కొంది.

ప్రస్తుతం చైనా మరిన్ని ప్రాంతాలపై కన్నేసిందని వివరించిన ఆ ఆఫీసర్, పాంగ్యాంగ్ సమీపంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య ఉన్న దాదాపు 8 కిలోమీటర్ల భూమిని ఆక్రమించేందుకు చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది.  

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...