Skip to main content

చూస్తుండగానే దుస్సాహసం... 1000 చదరపు కిలోమీటర్లను ఆక్రమించిన చైనా!

ఓ వైపు చైనా దురాక్రమణలను అడ్డుకునే పనిలో భారత సైన్యం నిరంతరం నిఘా పెట్టి, పోరాడుతూ ఉంటే, ఇప్పటికే ఎల్ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లో సుమారు 1000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించేసినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారంటూ, 'ది హిందూ' వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. ఓ వైపు చర్చలంటూనే, మరోవైపు చైనా పీపుల్స్ ఆర్మీ, చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చేసిందని ఆ అధికారి వెల్లడించారట.


వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి దెప్సాంగ్ ప్రాంతం నుంచి చుశుల్ వరకూ ఈ ఆక్రమణలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా దెప్సాంగ్ మైదానంలోని 10వ నంబర్ పెట్రోలింగ్ పాయింట్ నుంచి 13వ నంబర్ పాయింట్ వరకూ సుమారు 900 చదరపు కిలోమీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిపోయాయని, గాల్వాన్ లోయలో 20 చదరపు కిలోమీటర్లు పాంగ్యాంగ్ సరస్సు వద్ద 65 చదరపు కిలోమీటర్లు, హాట్ స్ప్రింగ్ సమీపంలో 12 చదరపు కిలోమీటర్లు, చుశుల్ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించిందని ఆ అధికారి వెల్లడించినట్టు 'ది హిందూ' పేర్కొంది.

ప్రస్తుతం చైనా మరిన్ని ప్రాంతాలపై కన్నేసిందని వివరించిన ఆ ఆఫీసర్, పాంగ్యాంగ్ సమీపంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య ఉన్న దాదాపు 8 కిలోమీటర్ల భూమిని ఆక్రమించేందుకు చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...