Skip to main content

మీ పాలసీ ల్యాప్స్ అయిందా? LIC గుడ్‌న్యూస్, రాయితీతో పునరుద్ధరణ నేటి నుండే

ఏదైనాకారణంతో మీ ఇన్సురెన్స్ పాలసీ రద్దయిందా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఏ కారణంతో అయినా ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రకటించింది. ఈ రోజు (ఆగస్ట్ 10, సోమవారం) నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

1ఈ పాలసీలు మినహా... లేట్ ఫీజుపై రాయితీ

టర్మ్ పాలసీలు, ఇతర అధఇక నష్టభయం పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీలను ఆలస్య రుసుముతో పునరుద్ధరించుకోవచ్చునని ఎల్ఐసీ తెలిపింది. ఆలస్య రుసుంపై 20 శాతం మినహాయింపు ఉందని, రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటే 25 శాతం రాయితీ కూడా ఉంటుందని మరో అదనపు ఊరట కల్పించింది. ఈ పాలసీల పునరుద్దరణ కోసం ఎల్ఐసీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది.

2అయిదేళ్లలోపు ఉంటే పునరుద్ధరణ

ఏ పథకానికి కూడా వైద్యపరమైన మినహాయింపులు ఏమీ ఇవ్వడం లేదని, అయితే లేట్ ఫీజు మాత్రం చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. అర్హత కలిగిన కొన్ని పథకాలను, వాయిదా చెల్లించలేని తేదీ నుండి అయిదేళ్లలోపు అయితే పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీ కాలవ్యవధి ముగియని వాటినే పునరుద్ధరించుకునే వీలు ఉందని తెలిపింది.

3ఇది మంచి అవకాశం

కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి అయిదేళ్ల నుండి తీసుకున్న నిర్ధిష్ట అర్హత కలిగిన పాలసీలను చెల్లించని మొదటి ప్రీమియం నుండి పునరుద్ధరించుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పాలసీదారులు తమ ఇన్సురెన్స్ పాలసీని కొనసాగించాలని కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.