Skip to main content

మీ పాలసీ ల్యాప్స్ అయిందా? LIC గుడ్‌న్యూస్, రాయితీతో పునరుద్ధరణ నేటి నుండే

ఏదైనాకారణంతో మీ ఇన్సురెన్స్ పాలసీ రద్దయిందా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఏ కారణంతో అయినా ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రకటించింది. ఈ రోజు (ఆగస్ట్ 10, సోమవారం) నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

1ఈ పాలసీలు మినహా... లేట్ ఫీజుపై రాయితీ

టర్మ్ పాలసీలు, ఇతర అధఇక నష్టభయం పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీలను ఆలస్య రుసుముతో పునరుద్ధరించుకోవచ్చునని ఎల్ఐసీ తెలిపింది. ఆలస్య రుసుంపై 20 శాతం మినహాయింపు ఉందని, రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటే 25 శాతం రాయితీ కూడా ఉంటుందని మరో అదనపు ఊరట కల్పించింది. ఈ పాలసీల పునరుద్దరణ కోసం ఎల్ఐసీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది.

2అయిదేళ్లలోపు ఉంటే పునరుద్ధరణ

ఏ పథకానికి కూడా వైద్యపరమైన మినహాయింపులు ఏమీ ఇవ్వడం లేదని, అయితే లేట్ ఫీజు మాత్రం చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. అర్హత కలిగిన కొన్ని పథకాలను, వాయిదా చెల్లించలేని తేదీ నుండి అయిదేళ్లలోపు అయితే పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీ కాలవ్యవధి ముగియని వాటినే పునరుద్ధరించుకునే వీలు ఉందని తెలిపింది.

3ఇది మంచి అవకాశం

కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి అయిదేళ్ల నుండి తీసుకున్న నిర్ధిష్ట అర్హత కలిగిన పాలసీలను చెల్లించని మొదటి ప్రీమియం నుండి పునరుద్ధరించుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పాలసీదారులు తమ ఇన్సురెన్స్ పాలసీని కొనసాగించాలని కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...