Skip to main content

మాకు ఎవరైనా ఒకటే : స్పందించిన ఫేస్ బుక్



భారత్లో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రిస్తున్నాయని అమెరికా మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్  ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం రేపిందనే చెప్పాలి. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,  వాట్సాప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్లో పెట్టుకుని నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దేశంలో తప్పుడు  వార్తలను, విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో, బిజేపి, ఆర్.ఎస్.ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని ట్విట్టర్లో పేర్కోన్నారు. చివరకు అమెరికా మీడియా ఈ బండారాన్ని బయటపెట్టిందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్‌బుక్‌ చెప్పాలని ఆయన అన్నారు. ఈ విషయం మీద స్పందించిన ఫేస్ బుక్ విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. వారు ఏ రాజకీయ పదవిలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ కి చెందిన వారైనా “విద్వేష పూరిత ప్రసంగాలు” చేస్తే నిబంధనలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని”,  “ఫేస్ బుక్ ప్రకటించింది.

మేం విద్వేష పూరిత ప్రసంగాలను, హింసను ప్రేరేపించే  కధనాలను, సమాచారాన్ని నిషేధిస్తాం. ఏ రాజకీయ పదవులలో ఉన్నవారైనా, ఏ పార్టీ వారైనా మేము ఉపేక్షించం. ఈ విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. అయితే, వీటిని అడ్డుకునేందుకు ఇంకా చాలా చెయ్యాలని మాకు తెలుసు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరిశీలిస్తూ, తనిఖీలు నిర్వహిస్తూ, ఈ విధానాలను చాలా చాలా ఖచ్చితంగా, అపోహలకు తావులేని రీతిలో అమలు చేస్తున్నాం. కొంత ప్రగతి కూడా సాధించాం, అని ఫేస్ బుక్ ప్రతినిధి ప్రకటన చేసింది. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...