Skip to main content

మాకు ఎవరైనా ఒకటే : స్పందించిన ఫేస్ బుక్



భారత్లో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రిస్తున్నాయని అమెరికా మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్  ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం రేపిందనే చెప్పాలి. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,  వాట్సాప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్లో పెట్టుకుని నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దేశంలో తప్పుడు  వార్తలను, విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో, బిజేపి, ఆర్.ఎస్.ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని ట్విట్టర్లో పేర్కోన్నారు. చివరకు అమెరికా మీడియా ఈ బండారాన్ని బయటపెట్టిందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్‌బుక్‌ చెప్పాలని ఆయన అన్నారు. ఈ విషయం మీద స్పందించిన ఫేస్ బుక్ విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. వారు ఏ రాజకీయ పదవిలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ కి చెందిన వారైనా “విద్వేష పూరిత ప్రసంగాలు” చేస్తే నిబంధనలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని”,  “ఫేస్ బుక్ ప్రకటించింది.

మేం విద్వేష పూరిత ప్రసంగాలను, హింసను ప్రేరేపించే  కధనాలను, సమాచారాన్ని నిషేధిస్తాం. ఏ రాజకీయ పదవులలో ఉన్నవారైనా, ఏ పార్టీ వారైనా మేము ఉపేక్షించం. ఈ విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. అయితే, వీటిని అడ్డుకునేందుకు ఇంకా చాలా చెయ్యాలని మాకు తెలుసు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరిశీలిస్తూ, తనిఖీలు నిర్వహిస్తూ, ఈ విధానాలను చాలా చాలా ఖచ్చితంగా, అపోహలకు తావులేని రీతిలో అమలు చేస్తున్నాం. కొంత ప్రగతి కూడా సాధించాం, అని ఫేస్ బుక్ ప్రతినిధి ప్రకటన చేసింది. 

Comments

Popular posts from this blog

అరటిపండ్లు తినడానికి ఏం తొందరపడుతున్నాయో... గోవులతో పవన్ కల్యాణ్ మురిపెం

జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...