కరోనా దెబ్బకు స్తంభించిపోయిన సినీ, టీవీ రంగాలకు ఊరటనిచ్చేలా కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్ డౌన్ అనంతరం షూటింగులు ప్రారంభమైనా కరోనా కేసులు వస్తుండడంతో అవి నిలిచిపోయాయి. తాజాగా అన్ లాక్-3లో భాగంగా కేంద్రం సినీ, టీవీ షూటింగులకు అనుమతి ఇచ్చింది. అయితే, అనేక నిబంధనలను విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన చేశారు. కెమెరా ముందు ఉండే నటీనటులు తప్ప మిగతా వాళ్లందరూ మాస్కులు వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment