Skip to main content

కరోనాను తగ్గిస్తున్న ఆయింట్‌మెంట్‌? యూఎస్‌ఎఫ్‌డీ ఆమోదం లభించిందన్న అమెరికన్‌ కంపెనీ

 


ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా పొట్టనబెట్టుకున్న కరోనా సహా అనేక వైరస్‌లను సంహరించే తమ ఆయింట్‌మెంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీయే ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ తెలిపింది. దీనిని కొనుగోలు చేసేందుకు వైద్యుడు సిఫార్సు చేసిన మందులు చిట్టీ అవసరం లేదని పేర్కొంది. సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చని వెల్లడించింది. ఆ ఆయింట్‌మెంట్‌ పేరు ఏపీటీ టీ3ఎక్స్‌ కావడం గమనార్హం.

‘టీ3ఎక్స్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత ఎలాంటి వైరస్‌ కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా తెలిసింది’ అని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్‌ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈవో డాక్టర్‌ బ్రియాన్‌ హ్యూబర్‌ తెలిపారు. ‘ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోపగడుతుంది. ఇదో గొప్ప ఆవిష్కరణ. ఇలాంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఇది ముందు వరుసలో నిలుస్తుంది. ఒక శక్తిమంతమైన రక్షణ పొరగా ఉపయోగపడుతుంది’ అని ఆయన తెలిపారు.

‘టీ3ఎక్స్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం ఉంది. మందుల చిట్టీ లేకుండానే కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడం సులువు. అందుకు ఆరోగ్య సిబ్బంది సాయమూ అవసరం లేదు’ అని ఆ కంపెనీ తెలిపింది ఏపీటీ టీ3ఎక్స్‌ కరోనా వైరస్‌ (ఎన్‌ఎల్‌ 63), ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని లండన్‌కు చెందిన ఓ ప్రయోగశాల నివేదించింది! సెకన్లల వ్యవధిలోనే వైరస్‌ విస్తరించే శక్తిని నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్‌ సంక్రమణను దాదాపుగా అడ్డుకోవచ్చని పేర్కొంది. ప్రయోగశాలలో నిర్దేశిత వాతావరణంలో 99% వైరల్‌ లోడ్‌ తగ్గిందని వెల్లడించింది. బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి రక్షణ కోసమూ దీనిని ఉపయోగించుకోవచ్చు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...