Skip to main content

కరోనాను తగ్గిస్తున్న ఆయింట్‌మెంట్‌? యూఎస్‌ఎఫ్‌డీ ఆమోదం లభించిందన్న అమెరికన్‌ కంపెనీ

 


ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా పొట్టనబెట్టుకున్న కరోనా సహా అనేక వైరస్‌లను సంహరించే తమ ఆయింట్‌మెంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీయే ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ తెలిపింది. దీనిని కొనుగోలు చేసేందుకు వైద్యుడు సిఫార్సు చేసిన మందులు చిట్టీ అవసరం లేదని పేర్కొంది. సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చని వెల్లడించింది. ఆ ఆయింట్‌మెంట్‌ పేరు ఏపీటీ టీ3ఎక్స్‌ కావడం గమనార్హం.

‘టీ3ఎక్స్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత ఎలాంటి వైరస్‌ కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా తెలిసింది’ అని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్‌ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈవో డాక్టర్‌ బ్రియాన్‌ హ్యూబర్‌ తెలిపారు. ‘ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోపగడుతుంది. ఇదో గొప్ప ఆవిష్కరణ. ఇలాంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఇది ముందు వరుసలో నిలుస్తుంది. ఒక శక్తిమంతమైన రక్షణ పొరగా ఉపయోగపడుతుంది’ అని ఆయన తెలిపారు.

‘టీ3ఎక్స్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం ఉంది. మందుల చిట్టీ లేకుండానే కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడం సులువు. అందుకు ఆరోగ్య సిబ్బంది సాయమూ అవసరం లేదు’ అని ఆ కంపెనీ తెలిపింది ఏపీటీ టీ3ఎక్స్‌ కరోనా వైరస్‌ (ఎన్‌ఎల్‌ 63), ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని లండన్‌కు చెందిన ఓ ప్రయోగశాల నివేదించింది! సెకన్లల వ్యవధిలోనే వైరస్‌ విస్తరించే శక్తిని నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్‌ సంక్రమణను దాదాపుగా అడ్డుకోవచ్చని పేర్కొంది. ప్రయోగశాలలో నిర్దేశిత వాతావరణంలో 99% వైరల్‌ లోడ్‌ తగ్గిందని వెల్లడించింది. బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి రక్షణ కోసమూ దీనిని ఉపయోగించుకోవచ్చు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...