కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కరోనా
సోకింది. లక్షణాలు కనిపించడంతో 2 సార్లు కరోనా టెస్ట్ చేయించుకోగా, రెండోసారి పాజిటివ్ గా తేలినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మంత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. తనను కలిసిన వారు, తనతో సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ నుంచి బిజెపి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా ఓ కంపెనీ తయారు చేసిన పాపడ్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.,
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment