కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కరోనా
సోకింది. లక్షణాలు కనిపించడంతో 2 సార్లు కరోనా టెస్ట్ చేయించుకోగా, రెండోసారి పాజిటివ్ గా తేలినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మంత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. తనను కలిసిన వారు, తనతో సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ నుంచి బిజెపి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా ఓ కంపెనీ తయారు చేసిన పాపడ్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.,
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం ఒక కార్పొరేషన్ ను సర్కారులో విలీనం చేయడమనేది గొప్ప విషయమని పేర్ని నాని అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని అన్నారని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని ప్రకటన చేశామని, దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందని పేర్ని నాని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యను తాము పాజిటివ్ గా తీసుకున్నామని చెప్పారు. కొన్ని నెలల్ల...

Comments
Post a Comment