Skip to main content

హోమ్‌లోన్‌పై అదిరిపోయే ఆఫర్, మార్కెట్లో అతి తక్కువ: ఎవరికి... ఎంత వడ్డీ?

 కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొనుగోళ్లు, తదనుగుణంగా ధరలు తగ్గిపోయాయి. ఈ సమయంలో చేతిలో డబ్బులు ఉన్నవాళ్లు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL) గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి.


1.వడ్డీ రేటు ఎంత.. ఎవరికి వర్తిస్తుంది?

దేశంలో అతిపెద్ద మార్టగేజ్ రుణాలు అందించే LICHFL వడ్డీరేటును గతంలో ఎన్నడు లేని విధంగా 6.90 శాతానికి తగ్గిస్తున్నట్లు బుధవారం తెలిపింది. అయితే సిబిల్ స్కోర్ 700కు పైగా ఉన్నవారు కొత్తగా రూ.50 లక్షల లోపు ఇంటి రుణం తీసుకున్న వారికి మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. రూ.50 లక్షలపై రుణం తీసుకున్నవారికి మాత్రం 7శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. హోమ్ లోన్స్ పైన వడ్డీరేటు చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గించడంతో నెలవారి చెల్లింపులు తగ్గుముఖం పట్టనున్నాయని, దీంతో హోమ్ లోన్స్ ఊపందుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మొహంతి తెలిపారు.

2.వరుసగా తగ్గింపు..

ఏప్రిల్ నెలలో LICHFL హోమ్ లోన్ వడ్డీ రేట్లను 7.5 శాతానికి తగ్గించింది. సిబిల్ స్కోర్ 800, అంతకు పైగా ఉన్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పుడు సిబిల్ స్కోర్‌ను 700కు పరిమితం చేయడంతో పాటు వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించడం గమనార్హం. సంస్థ కాస్ట్ అఫ్ ఫండ్ 5.6 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కంపెనీ రుణాల్లో 25 శాతం లోన్ మారటోరియం పరిధిలో ఉన్నట్లు సిద్ధార్థ్ తెలిపారు. రూ.13,000 కోట్ల నిర్మాణరంగ రుణాల్లో రూ.8,500 కోట్ల నుండి 9,000 కోట్లు మారటోరియం పరిధిలో ఉన్నాయన్నారు.

3.మార్కెట్లో కనిష్ట రేటు.. రుణం తీసుకున్నా తక్కువ వడ్డీ రేటుకు..

LICHFL హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటును 6.9 శాతానికి తగ్గించడంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. ఈ తగ్గింపు ద్వారా ఇప్పటికే మార్కెట్లోని ఇతర రుణ సంస్థల కంటే తక్కువ వడ్డీ రేటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐలు 6.95 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇప్పుడు LICHFL అంతకంటే తక్కువకు ఇస్తోంది. ఇప్పటికే LICHFLలో రుణాలు తీసుకున్న వారు కూడా నామమాత్రపు రీరైటింగ్ ఫీజు చెల్లించడం ద్వారా తక్కువ వడ్డీ రేటుకు మారే సౌకర్యం ఉంది.

4.పెన్షనర్లకు గృహ వరిష్ట

పెన్షనర్లకు కూడా LICHFL సరికొత్త గృహ వరిష్ట పథకాన్ని తీసుకు వచ్చింది. 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా రుణం తీసుకున్న తేదీ నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, రక్షణ బ్యాంకింగ్ రంగాల్లోని రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీసుల్లో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఎక్కువ రుణం కావాలంటే సంపాదించే తమ పిల్లలతో కలిసి పెన్షన్‌దారులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...