Skip to main content

హోమ్‌లోన్‌పై అదిరిపోయే ఆఫర్, మార్కెట్లో అతి తక్కువ: ఎవరికి... ఎంత వడ్డీ?

 కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొనుగోళ్లు, తదనుగుణంగా ధరలు తగ్గిపోయాయి. ఈ సమయంలో చేతిలో డబ్బులు ఉన్నవాళ్లు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL) గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి.


1.వడ్డీ రేటు ఎంత.. ఎవరికి వర్తిస్తుంది?

దేశంలో అతిపెద్ద మార్టగేజ్ రుణాలు అందించే LICHFL వడ్డీరేటును గతంలో ఎన్నడు లేని విధంగా 6.90 శాతానికి తగ్గిస్తున్నట్లు బుధవారం తెలిపింది. అయితే సిబిల్ స్కోర్ 700కు పైగా ఉన్నవారు కొత్తగా రూ.50 లక్షల లోపు ఇంటి రుణం తీసుకున్న వారికి మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. రూ.50 లక్షలపై రుణం తీసుకున్నవారికి మాత్రం 7శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. హోమ్ లోన్స్ పైన వడ్డీరేటు చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గించడంతో నెలవారి చెల్లింపులు తగ్గుముఖం పట్టనున్నాయని, దీంతో హోమ్ లోన్స్ ఊపందుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మొహంతి తెలిపారు.

2.వరుసగా తగ్గింపు..

ఏప్రిల్ నెలలో LICHFL హోమ్ లోన్ వడ్డీ రేట్లను 7.5 శాతానికి తగ్గించింది. సిబిల్ స్కోర్ 800, అంతకు పైగా ఉన్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పుడు సిబిల్ స్కోర్‌ను 700కు పరిమితం చేయడంతో పాటు వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించడం గమనార్హం. సంస్థ కాస్ట్ అఫ్ ఫండ్ 5.6 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కంపెనీ రుణాల్లో 25 శాతం లోన్ మారటోరియం పరిధిలో ఉన్నట్లు సిద్ధార్థ్ తెలిపారు. రూ.13,000 కోట్ల నిర్మాణరంగ రుణాల్లో రూ.8,500 కోట్ల నుండి 9,000 కోట్లు మారటోరియం పరిధిలో ఉన్నాయన్నారు.

3.మార్కెట్లో కనిష్ట రేటు.. రుణం తీసుకున్నా తక్కువ వడ్డీ రేటుకు..

LICHFL హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటును 6.9 శాతానికి తగ్గించడంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. ఈ తగ్గింపు ద్వారా ఇప్పటికే మార్కెట్లోని ఇతర రుణ సంస్థల కంటే తక్కువ వడ్డీ రేటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐలు 6.95 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇప్పుడు LICHFL అంతకంటే తక్కువకు ఇస్తోంది. ఇప్పటికే LICHFLలో రుణాలు తీసుకున్న వారు కూడా నామమాత్రపు రీరైటింగ్ ఫీజు చెల్లించడం ద్వారా తక్కువ వడ్డీ రేటుకు మారే సౌకర్యం ఉంది.

4.పెన్షనర్లకు గృహ వరిష్ట

పెన్షనర్లకు కూడా LICHFL సరికొత్త గృహ వరిష్ట పథకాన్ని తీసుకు వచ్చింది. 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా రుణం తీసుకున్న తేదీ నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, రక్షణ బ్యాంకింగ్ రంగాల్లోని రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీసుల్లో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఎక్కువ రుణం కావాలంటే సంపాదించే తమ పిల్లలతో కలిసి పెన్షన్‌దారులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.