Skip to main content

నేను కలలో కూడా ఊహించని వీడియో ఇది: ఆనంద్ మహీంద్రా


వీడియో చూడండి:Click here

తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను వెంటనే పంచుకునే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో వినూత్న వీడియోను పోస్ట్ చేశారు. స్టాండ్ వేసివున్న బైక్ ను స్టార్ట్ చేసి గేర్ లో ఉంచి, వెనుక చక్రాన్ని తిప్పుతూ, మొక్కజొన్న పొత్తులను దానికి ఆనించి పట్టుకోగా, విత్తనాలన్నీ చాలా సులభంగా విడిపోతూ కింద పడుతున్నాయి. ఈ చక్రం తిరిగే వేగానికి పది సెకన్లలోపే ఓ కండె నుంచి విత్తనాలను వేరు చేస్తున్నారు. చక్రానికి ఇరువైపులా ఇద్దరు కూర్చుని టకటకా పనిచేస్తున్నారు.


ఇక ఈ వీడియో ఆనంద్ మహీంద్రా వద్దకు చేరగా, ఇటువంటి సృజనాత్మకతను తాను కలలోనైనా చూడలేదన్నారు. "మన వ్యవసాయ విధానంలో బైకులు, ట్రాక్టర్లను వాడుతూ ఎన్నో రకాల పనులను రైతులు సులువుగా చేసుకుంటున్న వీడియోలు నాకెన్నో వస్తుంటాయి. ఈ వీడియో నేను కలలో కూడా ఊహించనిది. ఇకపై ''కార్న్ టినెంనల్" అనే ప్రత్యేక బ్రాండ్ ను ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో" అని వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిస వీడియోను మీరూ చూడవచ్చు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.