Skip to main content

గూగుల్ బంపర్ ఆఫర్.. ‘ఉచితంగా బ్యాకప్’



ఫ్రీగా డేటా బ్యాక్‌అప్‌’ను గూగుల్ ప్రకటించింది. క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీస్‌ ‘గూగుల్‌ వన్‌’ ఇక మీ ఐఓఎస్ (IOS)‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని డేటాను ‘ఫ్రీగా బ్యాక్‌అప్’‌ చేయనుంది. ఈ ఫ్యూచర్‌ను 2018 లో గూగుల్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటేనే ‘డేటా బ్యాక్‌అప్’‌ సౌకర్యం ఉంటుంది. అయితే గూగుల్‌ ఇందులో మార్పులు చేసింది.ఇప్పుడు ఐఓఎస్ (IOS)‌‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలోని డేటాను గూగుల్ ఖాతాతో ఉచితంగా బ్యాకప్ చేసుకునే అవకాశం ఉంది. ఐఓఎస్(IOS) యాప్‌ ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను బ్యాకప్ చేస్తుంది. ఇప్పటికే బ్యాకప్ చేయగల ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ఇప్పుడు ‘గూగుల్ వన్’ రిజిస్టేషన్లే లేకుండా బ్యాకప్‌ను అందిస్తుంది.

బ్యాకప్ ఫీచర్‌తో పాటు మొబైల్‌లో స్టోర్‌ అయిన ఫైల్‌ల నిర్వహణను ‘గూగుల్‌ వన్‌’ వినియోగదారులకు అనుకూలంగా మార్చింది. ఈ భద్రపరుచుకునే సౌకర్యాన్ని మొబైల్స్‌తోపాటు వెబ్ ‘ప్లాట్‌ఫామ్’‌లకు అవకాశం ఇచ్చంది.  జీ మెయిల్‌(gmail), ఫోటోలు, డ్రైవ్ నుంచి ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.