Skip to main content

గూగుల్ బంపర్ ఆఫర్.. ‘ఉచితంగా బ్యాకప్’



ఫ్రీగా డేటా బ్యాక్‌అప్‌’ను గూగుల్ ప్రకటించింది. క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీస్‌ ‘గూగుల్‌ వన్‌’ ఇక మీ ఐఓఎస్ (IOS)‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని డేటాను ‘ఫ్రీగా బ్యాక్‌అప్’‌ చేయనుంది. ఈ ఫ్యూచర్‌ను 2018 లో గూగుల్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటేనే ‘డేటా బ్యాక్‌అప్’‌ సౌకర్యం ఉంటుంది. అయితే గూగుల్‌ ఇందులో మార్పులు చేసింది.ఇప్పుడు ఐఓఎస్ (IOS)‌‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలోని డేటాను గూగుల్ ఖాతాతో ఉచితంగా బ్యాకప్ చేసుకునే అవకాశం ఉంది. ఐఓఎస్(IOS) యాప్‌ ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను బ్యాకప్ చేస్తుంది. ఇప్పటికే బ్యాకప్ చేయగల ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ఇప్పుడు ‘గూగుల్ వన్’ రిజిస్టేషన్లే లేకుండా బ్యాకప్‌ను అందిస్తుంది.

బ్యాకప్ ఫీచర్‌తో పాటు మొబైల్‌లో స్టోర్‌ అయిన ఫైల్‌ల నిర్వహణను ‘గూగుల్‌ వన్‌’ వినియోగదారులకు అనుకూలంగా మార్చింది. ఈ భద్రపరుచుకునే సౌకర్యాన్ని మొబైల్స్‌తోపాటు వెబ్ ‘ప్లాట్‌ఫామ్’‌లకు అవకాశం ఇచ్చంది.  జీ మెయిల్‌(gmail), ఫోటోలు, డ్రైవ్ నుంచి ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...