బొమ్మాకు మురళి నిర్మాణంలో RGV పర్యవేక్షణలో "దొరసాయి తేజ" ఈ చిత్రానికి దర్శకత్వం చేయనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది.... ఒక్కో పార్టు రెండు గంటల నిడివితో...మొత్తం మూడు భాగాలు నిర్మితం కానుంది... వివిధ దశల్లోని మొదటి రెండు భాగాల్లో *రాము* క్యారెక్టర్ ను ఇతర నటులు పోషించనుండగా... కీలకమైన మూడవ భాగంలో స్వయంగా *రాంగోపాల్ వర్మ* నటించనున్నారు
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment