Skip to main content

భాగ్యరాజా చిత్రానికి 'నో' చెప్పిన అనుష్క!

  

తమిళ చిత్రరంగంలో దర్శకుడు భాగ్యరాజా ఒక సంచలనం. కొత్త ఒరవడిలో ఆయన రూపొందించిన సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో 1983లో ఆయన నుంచి వచ్చిన చిత్రం 'ముందానై ముడిచ్చు' పెద్ద హిట్టయింది. ఊర్వశిని కథానాయికగా పరిచయం చేస్తూ ఆయన రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. దీంతో దీనిని 'మూడు ముళ్లు' పేరిట జంధ్యాల దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయగా అది కూడా హిట్టయింది.


ఇక ఇన్నాళ్లకి దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నాలను దర్శకుడు భాగ్యరాజా మొదలెట్టారు. శశికుమార్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు అనుష్క అయితే పెర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించిన భాగ్యరాజా ఆమెను అడిగినట్టు, అయితే, ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఆమె దీనికి 'నో' చెప్పడానికి కారణం వెల్లడి కానప్పటికీ, పెళ్లిచేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలన్న కారణంతోనే అనుష్క సినిమాలను తిరస్కరిస్తోందని అంటున్నారు.  

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.