Skip to main content

భాగ్యరాజా చిత్రానికి 'నో' చెప్పిన అనుష్క!

  

తమిళ చిత్రరంగంలో దర్శకుడు భాగ్యరాజా ఒక సంచలనం. కొత్త ఒరవడిలో ఆయన రూపొందించిన సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో 1983లో ఆయన నుంచి వచ్చిన చిత్రం 'ముందానై ముడిచ్చు' పెద్ద హిట్టయింది. ఊర్వశిని కథానాయికగా పరిచయం చేస్తూ ఆయన రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. దీంతో దీనిని 'మూడు ముళ్లు' పేరిట జంధ్యాల దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయగా అది కూడా హిట్టయింది.


ఇక ఇన్నాళ్లకి దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నాలను దర్శకుడు భాగ్యరాజా మొదలెట్టారు. శశికుమార్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు అనుష్క అయితే పెర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించిన భాగ్యరాజా ఆమెను అడిగినట్టు, అయితే, ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఆమె దీనికి 'నో' చెప్పడానికి కారణం వెల్లడి కానప్పటికీ, పెళ్లిచేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలన్న కారణంతోనే అనుష్క సినిమాలను తిరస్కరిస్తోందని అంటున్నారు.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...