నిన్న మొన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న విలువైన లోహాల ధరలు కొద్దిగా దిగొచ్చాయి. న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 1,317 తగ్గి రూ. 54,763కు చేరుకోగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2,943 తగ్గి, రూ. 73,600కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,564 తగ్గి, రూ. 53,951కి, వెండి ధర రూ. 2,397 తగ్గి రూ. 71,211కుచేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశవాళీ మార్కెట్ పైనా పడిందని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా బంగారం ధరలను తగ్గేలా చేశాయని వ్యాఖ్యానించారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment