Skip to main content

రేపు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్న జగన్

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరాలపై అధికారులతో చర్చించనున్నారు. దీంతోపాటు, ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియపై కూడా చర్చలు జరపనున్నారు.

మరోవైపు, ఈరోజు జగన్ పర్యాటకశాఖపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అనుకూలంగా నూతన టూరిజం పాలసీ ఉండాలని ఆదేశించారు. పర్యాటకరంగంలో ఏపీకి తగిన స్థానం లభించేలా కృషి చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 వరకు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఒక మంచి విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని జగన్ చెప్పారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం కలిగేలా ఆ కాలేజీ ఉండాలని అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి సగం పూర్తైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...