Skip to main content

రేపు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్న జగన్

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరాలపై అధికారులతో చర్చించనున్నారు. దీంతోపాటు, ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియపై కూడా చర్చలు జరపనున్నారు.

మరోవైపు, ఈరోజు జగన్ పర్యాటకశాఖపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అనుకూలంగా నూతన టూరిజం పాలసీ ఉండాలని ఆదేశించారు. పర్యాటకరంగంలో ఏపీకి తగిన స్థానం లభించేలా కృషి చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 వరకు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఒక మంచి విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని జగన్ చెప్పారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం కలిగేలా ఆ కాలేజీ ఉండాలని అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి సగం పూర్తైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.  

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.