Skip to main content

రెండు కోట్లు దాటిన కరోనా కేసులు.. భార‌త్‌లో య‌మ స్పీడ్‌..!

 


ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఏకంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది... ఇక‌, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భార‌త్‌లోనే క‌రోనా కేసులు సంఖ్య య‌మ స్పీడ్‌గా దూసుకెళ్తోంది.. ప్రస్తుతం దేశంలో ప్రతీరోజూ 60 వేలకుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఏకంగా పాజిటివ్ కేసులు 62 వేలు దాటిపోయింది.. క‌రోనా గ‌ణాంకాల ప్రకారం ప్రపంచ‌వ్యాప్తంగా 2,00,23,016కు చేర‌గా.. ఇప్పటివరకు మృతిచెందిన‌వారి సంఖ్య 7,33,973కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గడ‌చిన‌ 24 గంటల్లో 3 లక్షల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రోవైపు, క‌రోనాబారిన‌ప‌డి కోలుకున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఇప్పటి వరకు 1,28,97,813 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది కరోనా బారిన‌ప‌డ్డారు. వారిలో 26,64,701 మంది కోలుకున్నారు. 23,69,126 మంది చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఇప్పటివరకు 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,075గా ఉంది. ఇప్పటివరకు 44,386 మంది క‌రోనాతో మృతిచెందారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.