Skip to main content

రెండు కోట్లు దాటిన కరోనా కేసులు.. భార‌త్‌లో య‌మ స్పీడ్‌..!

 


ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఏకంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది... ఇక‌, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భార‌త్‌లోనే క‌రోనా కేసులు సంఖ్య య‌మ స్పీడ్‌గా దూసుకెళ్తోంది.. ప్రస్తుతం దేశంలో ప్రతీరోజూ 60 వేలకుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఏకంగా పాజిటివ్ కేసులు 62 వేలు దాటిపోయింది.. క‌రోనా గ‌ణాంకాల ప్రకారం ప్రపంచ‌వ్యాప్తంగా 2,00,23,016కు చేర‌గా.. ఇప్పటివరకు మృతిచెందిన‌వారి సంఖ్య 7,33,973కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గడ‌చిన‌ 24 గంటల్లో 3 లక్షల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రోవైపు, క‌రోనాబారిన‌ప‌డి కోలుకున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఇప్పటి వరకు 1,28,97,813 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది కరోనా బారిన‌ప‌డ్డారు. వారిలో 26,64,701 మంది కోలుకున్నారు. 23,69,126 మంది చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఇప్పటివరకు 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,075గా ఉంది. ఇప్పటివరకు 44,386 మంది క‌రోనాతో మృతిచెందారు. 

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...