Skip to main content

రెండు కోట్లు దాటిన కరోనా కేసులు.. భార‌త్‌లో య‌మ స్పీడ్‌..!

 


ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఏకంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది... ఇక‌, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భార‌త్‌లోనే క‌రోనా కేసులు సంఖ్య య‌మ స్పీడ్‌గా దూసుకెళ్తోంది.. ప్రస్తుతం దేశంలో ప్రతీరోజూ 60 వేలకుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఏకంగా పాజిటివ్ కేసులు 62 వేలు దాటిపోయింది.. క‌రోనా గ‌ణాంకాల ప్రకారం ప్రపంచ‌వ్యాప్తంగా 2,00,23,016కు చేర‌గా.. ఇప్పటివరకు మృతిచెందిన‌వారి సంఖ్య 7,33,973కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గడ‌చిన‌ 24 గంటల్లో 3 లక్షల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రోవైపు, క‌రోనాబారిన‌ప‌డి కోలుకున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఇప్పటి వరకు 1,28,97,813 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది కరోనా బారిన‌ప‌డ్డారు. వారిలో 26,64,701 మంది కోలుకున్నారు. 23,69,126 మంది చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఇప్పటివరకు 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,075గా ఉంది. ఇప్పటివరకు 44,386 మంది క‌రోనాతో మృతిచెందారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...