Skip to main content

తెలంగాణ లో ఆన్ లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు ?


సర్కార్కు ప్రతిపాదనలు పంపిన బోర్డ్
ముందు సర్కార్ కాలేజీల్లో ..తర్వాతే ప్రైవేటులో..

 అడ్మిషన్ ప్ర‌క్రియలో మార్పులు చేసే యోచనలో బోర్డు అధికారులున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్లో అడ్మిషన్లు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు ఓకే చెప్పిన వెంటనే, ముందుకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటుకు చెక్ పెట్టేందుకే..
కరోనా ఎఫెక్ట్ తో ఈసారి అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థంగా మారింది. జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రాసెస్ ఇప్పటికీ షురూ కాలేదు. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి అడ్మిషన్లు తీసుకునే పరిస్థితులు లేవు. టెన్త్ రిజల్ట‌స్  ప్ర‌కటించి రెండు నెలలు దాటింది. అప్పటి నుంచి వారంతా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్స్ ను పాస్ చేయడంతో 5.34 లక్షల మంది పాస్ అయ్యారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇప్పుడే చేరితే ఫీజు తగ్గిస్తామంటూ పేరెంట్స్ ను ఒప్పించి, కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. సర్కారు కాలేజీల్లో మాత్రం ఇప్పటికీ అడ్మిషన్ల హడావుడి లేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేసేందుకు ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీన్ని అమలు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సర్కారు కాలేజీలకే ఫస్ట్ ప్రయారిటీ
రాష్ట్రంలో 404 సర్కారు కాలేజీలుండగా, గతేడాది లక్ష మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈసారి టెన్త్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెరగడం, మిడ్ డే మిల్స్సౌకర్యం కూడా ఉండటంతో అడ్మిషన్లు లక్షన్నర దాటే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆన్ లైన్ అడ్మిషన్లను ముందుగా గవర్నమెంట్ కాలేజీలకు.. ఆ తర్వాతే ప్రైవేటు కాలేజీలకు అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. టెన్త్ మెమో నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్ లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక కాలేజీలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్, మళ్లీవేరే కాలేజీలో చేరే అవకాశం ఉండదు. దీంతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో మరోవారం, పది రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది


Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...