Skip to main content

తెలంగాణ లో ఆన్ లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు ?


సర్కార్కు ప్రతిపాదనలు పంపిన బోర్డ్
ముందు సర్కార్ కాలేజీల్లో ..తర్వాతే ప్రైవేటులో..

 అడ్మిషన్ ప్ర‌క్రియలో మార్పులు చేసే యోచనలో బోర్డు అధికారులున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్లో అడ్మిషన్లు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు ఓకే చెప్పిన వెంటనే, ముందుకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటుకు చెక్ పెట్టేందుకే..
కరోనా ఎఫెక్ట్ తో ఈసారి అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థంగా మారింది. జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రాసెస్ ఇప్పటికీ షురూ కాలేదు. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి అడ్మిషన్లు తీసుకునే పరిస్థితులు లేవు. టెన్త్ రిజల్ట‌స్  ప్ర‌కటించి రెండు నెలలు దాటింది. అప్పటి నుంచి వారంతా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్స్ ను పాస్ చేయడంతో 5.34 లక్షల మంది పాస్ అయ్యారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇప్పుడే చేరితే ఫీజు తగ్గిస్తామంటూ పేరెంట్స్ ను ఒప్పించి, కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. సర్కారు కాలేజీల్లో మాత్రం ఇప్పటికీ అడ్మిషన్ల హడావుడి లేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేసేందుకు ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీన్ని అమలు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సర్కారు కాలేజీలకే ఫస్ట్ ప్రయారిటీ
రాష్ట్రంలో 404 సర్కారు కాలేజీలుండగా, గతేడాది లక్ష మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈసారి టెన్త్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెరగడం, మిడ్ డే మిల్స్సౌకర్యం కూడా ఉండటంతో అడ్మిషన్లు లక్షన్నర దాటే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆన్ లైన్ అడ్మిషన్లను ముందుగా గవర్నమెంట్ కాలేజీలకు.. ఆ తర్వాతే ప్రైవేటు కాలేజీలకు అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. టెన్త్ మెమో నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్ లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక కాలేజీలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్, మళ్లీవేరే కాలేజీలో చేరే అవకాశం ఉండదు. దీంతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో మరోవారం, పది రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది


Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...