Skip to main content

తెలంగాణ లో ఆన్ లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు ?


సర్కార్కు ప్రతిపాదనలు పంపిన బోర్డ్
ముందు సర్కార్ కాలేజీల్లో ..తర్వాతే ప్రైవేటులో..

 అడ్మిషన్ ప్ర‌క్రియలో మార్పులు చేసే యోచనలో బోర్డు అధికారులున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్లో అడ్మిషన్లు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు ఓకే చెప్పిన వెంటనే, ముందుకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటుకు చెక్ పెట్టేందుకే..
కరోనా ఎఫెక్ట్ తో ఈసారి అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థంగా మారింది. జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రాసెస్ ఇప్పటికీ షురూ కాలేదు. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి అడ్మిషన్లు తీసుకునే పరిస్థితులు లేవు. టెన్త్ రిజల్ట‌స్  ప్ర‌కటించి రెండు నెలలు దాటింది. అప్పటి నుంచి వారంతా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్స్ ను పాస్ చేయడంతో 5.34 లక్షల మంది పాస్ అయ్యారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇప్పుడే చేరితే ఫీజు తగ్గిస్తామంటూ పేరెంట్స్ ను ఒప్పించి, కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. సర్కారు కాలేజీల్లో మాత్రం ఇప్పటికీ అడ్మిషన్ల హడావుడి లేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేసేందుకు ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీన్ని అమలు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సర్కారు కాలేజీలకే ఫస్ట్ ప్రయారిటీ
రాష్ట్రంలో 404 సర్కారు కాలేజీలుండగా, గతేడాది లక్ష మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈసారి టెన్త్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెరగడం, మిడ్ డే మిల్స్సౌకర్యం కూడా ఉండటంతో అడ్మిషన్లు లక్షన్నర దాటే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆన్ లైన్ అడ్మిషన్లను ముందుగా గవర్నమెంట్ కాలేజీలకు.. ఆ తర్వాతే ప్రైవేటు కాలేజీలకు అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. టెన్త్ మెమో నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్ లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక కాలేజీలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్, మళ్లీవేరే కాలేజీలో చేరే అవకాశం ఉండదు. దీంతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో మరోవారం, పది రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది


Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.