Skip to main content

తెలంగాణ లో ఆన్ లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు ?


సర్కార్కు ప్రతిపాదనలు పంపిన బోర్డ్
ముందు సర్కార్ కాలేజీల్లో ..తర్వాతే ప్రైవేటులో..

 అడ్మిషన్ ప్ర‌క్రియలో మార్పులు చేసే యోచనలో బోర్డు అధికారులున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్లో అడ్మిషన్లు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు ఓకే చెప్పిన వెంటనే, ముందుకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటుకు చెక్ పెట్టేందుకే..
కరోనా ఎఫెక్ట్ తో ఈసారి అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థంగా మారింది. జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రాసెస్ ఇప్పటికీ షురూ కాలేదు. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి అడ్మిషన్లు తీసుకునే పరిస్థితులు లేవు. టెన్త్ రిజల్ట‌స్  ప్ర‌కటించి రెండు నెలలు దాటింది. అప్పటి నుంచి వారంతా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్స్ ను పాస్ చేయడంతో 5.34 లక్షల మంది పాస్ అయ్యారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇప్పుడే చేరితే ఫీజు తగ్గిస్తామంటూ పేరెంట్స్ ను ఒప్పించి, కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. సర్కారు కాలేజీల్లో మాత్రం ఇప్పటికీ అడ్మిషన్ల హడావుడి లేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేసేందుకు ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీన్ని అమలు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సర్కారు కాలేజీలకే ఫస్ట్ ప్రయారిటీ
రాష్ట్రంలో 404 సర్కారు కాలేజీలుండగా, గతేడాది లక్ష మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈసారి టెన్త్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెరగడం, మిడ్ డే మిల్స్సౌకర్యం కూడా ఉండటంతో అడ్మిషన్లు లక్షన్నర దాటే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆన్ లైన్ అడ్మిషన్లను ముందుగా గవర్నమెంట్ కాలేజీలకు.. ఆ తర్వాతే ప్రైవేటు కాలేజీలకు అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. టెన్త్ మెమో నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్ లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక కాలేజీలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్, మళ్లీవేరే కాలేజీలో చేరే అవకాశం ఉండదు. దీంతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో మరోవారం, పది రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది


Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...